తెలంగాణ

telangana

MLC Kavitha on Rahul Gandhi Mulugu Speech : 'రాష్ట్రాన్ని విడగొట్టేలా రాహుల్​ గాంధీ ప్రసంగం.. అలాంటి పార్టీ మనకు అవసరమా'

By ETV Bharat Telangana Team

Published : Oct 19, 2023, 1:04 PM IST

MLC Kavitha on Rahul Gandhi Mulugu Speech : ములుగు బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. వారి తెలంగాణ.. వీరి తెలంగాణ అంటూ రాహుల్​ రాష్ట్రాన్ని విడగొట్టేలా మాట్లాడారంటూ విమర్శించారు. ఈ క్రమంలోనే రూ.లక్ష కోట్లలోపు ప్రాజెక్టుల్లో.. రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమవుతుందని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ ప్రేమికులకు మధ్య ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు.

kavitha counter to revanth reddy
MLC Kavitha on Rahul Gandhi Mulugu Speech

MLC Kavitha on Rahul Gandhi Mulugu Speech రాష్ట్రాన్ని విడగొట్టేలా రాహుల్​ గాంధీ ప్రసంగం ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha on Rahul Gandhi Mulugu Speech :నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌లో ఎమ్మెల్సీ కవిత నేడు పర్యటించారు. ఈ సందర్భంగా ములుగు బహిరంగ సభలో బుధవారం రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. వారి తెలంగాణ.. వీరి తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని విడగొట్టేలా రాహుల్​ మాట్లాడారంటూ కవితవిమర్శించారు. ఈ క్రమంలోనే రూ.లక్ష కోట్లలోపు ప్రాజెక్టుల్లో.. రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమవుతుందని సూటిగా ప్రశ్నించారు. హస్తం పార్టీ మాదిరిగా కమీషన్లు తీసుకుంటే చెరువుల్లోకి నీరు కాకుండా.. రైతుల కంట కన్నీరు వచ్చేదన్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే ధరణి, 24 గంటల కరెంట్ దూరమవుతుందని చెప్పారు. తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ ప్రేమికులకు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని కవిత తెలిపారు.

MLC Kavitha Fires on Revanth Reddy : సింగరేణి కార్మికులకు బీఆర్​ఎస్​ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి వ్యాఖ్యలపైనా ఆమె స్పందించారు. గనులను మూసేసి కార్మికులకు అన్యాయం చేసిందే కాంగ్రెస్‌ పార్టీ అన్న ఆమె.. తాడిచర్ల మైన్‌ను ప్రైవేటుకు ఇచ్చింది హస్తం పార్టీనే అని గుర్తు చేశారు. మాయమాటలు చెబుతున్న ఆ పార్టీని సింగరేణి కార్మికులు నిలదీయాలన్నారు.

MLC Kavitha Fires on Rahul Gandhi : 'రాహుల్ ఇక్కడికి వచ్చి మీరు చేసేదేం లేదు.. అంకాపూర్ చికెన్ తినేసి వెళ్లండి'

కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామంటోందని.. ధరణిని రద్దు చేస్తే రైతుబంధు ఎలా వస్తుందని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే 24 గంటల కరెంటు ఉండదని ఆరోపించారు. ఈ క్రమంలోనే తెలంగాణ పథకాలను చాలా రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయన్న ఆమె.. రాష్ట్రంలో బీఆర్​ఎస్​ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

"గనులను మూసేసి కార్మికులకు అన్యాయం చేసిందే కాంగ్రెస్‌. తాడిచర్ల మైన్‌ను ప్రైవేటుకు ఇచ్చింది కాంగ్రెస్‌. కాంగ్రెస్‌ పార్టీని సింగరేణి కార్మికులు నిలదీయాలి. తెలంగాణ పథకాలను చాలా రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి. బీఆర్​ఎస్​ ప్రభుత్వం మూడోసారి తెలంగాణలో అధికారంలోకి వస్తుంది." - ఎమ్మెల్సీ కవిత

అంతకుముందు ట్విటర్​ వేదికగానూ హస్తం పార్టీపై కవిత విమర్శనాస్త్రాలు సంధించారు. మోసం కాంగ్రెస్ నైజమని.. కాంగ్రెస్‌కు ఓటేస్తే కర్ణాటక గతే మనకూ పడుతుందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో 20 గంటల కరెంటు ఇస్తామని కర్ణాటకలో హామీ ఇచ్చారని.. ఇప్పుడు 5 గంటల కరెంటుతో సరిపెట్టుకోమంటున్నారని తెలిపారు. ఇక్కడ రేవంత్‌ రెడ్డి కూడా 3 గంటల కరెంటు చాలంటున్నారన్న ఆమె.. కరెంటు కష్టాలు తెచ్చే కాంగ్రెస్ మనకెందుకు అని ప్రశ్నించారు. ఉచితంగా 24 గంటల కరెంటు‌ ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని.. మరోసారి కేసీఆర్‌కే మద్దతుగా నిలుద్దామని కోరారు.

MLC Kavitha Bathukamma Song : 'అవనిపై గౌరీదేవి బతుకమ్మై వెలసిందో ఓ సందామావయ్యా'.. ఎమ్మెల్సీ కవిత పాడిన బతుకమ్మ పాట విన్నారా..?

మోసం కాంగ్రెస్ నైజం.. కాంగ్రెస్​కు ఓటేస్తే కర్ణాటక గతే.. కాంగ్రెస్ వస్తే కరెంటు కటకటలు.. 20 గంటల పాటు కరెంటు ఇస్తామని ఎన్నికలప్పుడు చెప్పి.. ఇప్పుడు 5 గంటల కరెంట్​తో సరిపెట్టుకోండని కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి అంటున్నారు. 5 గంటల.. 3 గంటల పార్టీలు మనకొద్దు. దేశంలో ఉచితంగా 24 గంటల కరెంటు‌ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్​కే మరోసారి మద్దతుగా నిలుద్దాం. - ట్విటర్​లో ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha Fires on BJP and Congress : 'బీఆర్​ఎస్​ మేనిఫెస్టోపై కాంగ్రెస్​, బీజేపీవి దిగజారుడు మాటలు'

MLC Kavitha on Rahul Gandhi Comments : సత్య దూరమైన మాటలు చెప్పడం రాహుల్‌ గాంధీకి అలవాటే: ఎమ్మెల్సీ కవిత

ABOUT THE AUTHOR

...view details