తెలంగాణ

telangana

బాసరలో వసంత పంచమి వేడుకలు.. అక్షరాభ్యాసానికి పోటెత్తిన భక్తులు

By

Published : Jan 26, 2023, 1:38 PM IST

Updated : Jan 26, 2023, 1:45 PM IST

Vasanta Panchami at Basara
Vasanta Panchami at Basara

Vasanta Panchami at Basara : సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి | విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా!! అనే మంత్రం ఇప్పుడు బాసరలో మార్మోగుతోంది. పిల్లల చేత ఈ మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రులు వారికి అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. భక్తిశ్రద్ధలతో చదువుల తల్లిని మనసులో జపిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Vasanta Panchami at Basara: నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో కన్నుల పండవగా వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. వేకువజామున 3 గంటలనుంచే అమ్మవారి దర్శనానికి క్యూలైన్​లలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున రెండు గంటలకు అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మూడు గంటల నుంచి అక్షర శ్రీకార పూజలను అర్చకులు ప్రారంభించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Vasant Panchami in Basara : ఉదయం 7 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి, ఎమ్మెల్యే విటల్ ​రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్త్రాలు సమర్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బాసరలో మంత్రి జాతీయ పతాకం ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా భక్తులకు తిప్పలు తప్పలేదు. క్యూలైన్​లలో భక్తులు తమ పిల్లలను తీసుకొని గంటల తరబడి నిలుచున్నారు.

వసంత పంచమి వేడుక కావడంతో ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తుతున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి ఇక్కడికి తీసుకువచ్చారని తెలిపారు. ఇప్పటివరకు 2000 మంది పిల్లలకు అక్షరాభ్యాసం పూర్తి అయ్యిందని వెల్లడించారు. సరస్వతీమాత కటాక్షం ఉంటే తమ పిల్లల భవిష్యత్ దేదీప్యమానంగా వెలుగుతుందని.. బంగారు భవిష్యత్ అవుతుంది తల్లిదండ్రుల నమ్మకమని మంత్రి చెప్పారు.

Basanth Panchami Celebrations In Basara: ఎక్కువ మంది అర్చక స్వాములను ఏర్పాటు చేసి.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ నుంచే కాకుండా, ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా అనేకమంది తమ పిల్లల అక్షరాభ్యాసం కోసం వచ్చారని చెప్పారు. ఉత్తర భారతదేశంలో జమ్మూ కశ్మీర్​ ఆలయం, దక్షిణ భారతంలో బాసర ఆలయం తప్ప మరెక్కడా సరస్వతీమాత ఆలయాలు లేవని.. అందువల్లనే ఇక్కడకు వేలాది మంది భక్తులు వస్తున్నారని వెల్లడించారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూడా ఇక్కడే అక్షరాభ్యాసం చేయించుకున్నారని గుర్తుచేశారు.

టీఎస్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులు:వసంత పంచమికి ప్రత్యేక బస్సులు నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. ఈ పర్వదినం సందర్భంగా అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం, ప్రత్యేక పూజలు చేసేందుకు తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇవాళ బాసర, వర్గల్​కు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మొత్తంగా 108 ప్రత్యేక బస్సులు నడపనుండగా.. వీటిలో నిర్మల్‌ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం బాసరకు 88 బస్సులు, సిద్దిపేట జిల్లా వర్గల్‌కు 20 ప్రత్యేక బస్సులను నడపుతోంది.

ఇవీ చదవండి:

Last Updated :Jan 26, 2023, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details