నారాయణపేట జిల్లా ధన్వాడలో .. స్థానిక భాజపా నాయకులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. రైతు వేదికపై ప్రధాని మోదీ చిత్రాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక భాజపా నాయకులు కొన్ని రోజులుగా కోరుతున్నారు. దీనిపై స్పందన లేకపోవటంతో.. రాత్రి రైతు వేదిక భవనం పై ప్రధాని చిత్రాన్ని ఏర్పాటు చేశారు. గుర్తించిన తెరాస నాయకులు దాన్ని తొలగించటంతో భాజపా నాయకులు మంత్రుల పర్యటనను అడ్డుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా.. ఈ నెల 28న రైతు వేదిక ప్రారంభోత్సవానికి వస్తున్న మంత్రులు నిరంజన్ రెడ్డి , శ్రీనివాస్ గౌడ్ పర్యటనను అడ్డుకోవాలని ప్రయత్నించారు.
ప్లకార్డులు పట్టుకుని ..