తెలంగాణ

telangana

లాఠీఛార్జీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీకే అరుణ

By

Published : Jan 3, 2021, 8:47 PM IST

భాజపా కార్యకర్తలపై లాఠీఛార్జీ చేసిన పోలీసులను సస్పెండ్​ చేయాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల పరిధిలో భాజపా కార్యకర్తలపై పోలీసుల వ్యవహరించిన తీరును ఆమె ఖండించారు.

dk aruna press meet in narayanapeta district
లాఠీఛార్జీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీకే అరుణ

నారాయణపేట జిల్లా ధన్వాడ మండల పరిధిలో భాజపా కార్యకర్త పై లాఠీఛార్జీ చేసిన పోలీసులపై చర్య తీసుకోవాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్​ చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలపై పెట్టిన రౌడీషీటర్ కేసులను ఎత్తి వేయాలన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ వెంటనే స్పందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో తెరాస ప్రభుత్వం ప్రధాన మంత్రి మోదీ చిత్రపటాన్ని పెట్టాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:రోజుకు పదిలక్షల మందికి కరోనా టీకా: మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details