తెలంగాణ

telangana

Amith Sha Munugodu Schedule అమిత్​ షా మునుగోడు పర్యటన షెడ్యూల్ ఇదే

By

Published : Aug 18, 2022, 7:52 PM IST

Amith Sha Munugodu Schedule
అమిత్​ షా ()

Amith Sha Munugodu Schedule మునుగోడుపై ప్రత్యేక దృష్టి సారించిన భాజపా ఈనెల 21న భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్​ షా హాజరు కానున్నారు. ఈ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. అదే రోజు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భాజపాలో చేరనున్నారు.

Amith Sha Munugodu Schedule కేంద్ర హోంమంత్రి మునుగోడు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 21న జరగనున్న భాజపా భారీ బహిరంగ సభకు అమిత్​ షా హాజరు కానున్నారు. అమిత్ షా ఈ నెల 21న మధ్యాహ్నం మూడున్నర గంటలకు హైదరాబాద్​లోని బేగంపేట విమానాశ్రాయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్​లో బయలుదేరి సాయంత్రం నాలుగున్నర గంటలకు మునుగోడుకు చేరకుంటారు.

అనంతరం సాయంత్రం 5గంటలకు మునుగోడులో జరిగే భారీ బహిరంగ సభలో అమిత్​ షా పాల్గొంటారు. ఇదే సభలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భాజపాలోకి ఆహ్వానించనున్నారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక హెలీకాప్టర్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు. మునుగోడు పర్యటన నేపథ్యంలో సీఆర్పీఎఫ్‌ అధికారులు రాష్ట్ర పోలీస్ అధికారులతో భద్రతపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

మునుగోడు దంగల్‌కు కాషాయదళం సిద్ధమవుతోంది. ఇప్పటికే పలువురు నేతలు నియోజకవర్గంలో పర్యటిస్తూ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 21న మునుగోడులో భారీ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అమిత్‌షా వస్తుండటంతో.. సభకు పెద్దఎత్తున జనాన్ని తీసుకొచ్చేందుకు నేతలు శ్రమిస్తున్నారు. ఇప్పటికే జన సమీకరణ, ఇతర ఏర్పాట్ల కోసం పార్టీ రాష్ట్ర నాయకత్వం.. మండలానికి ఇద్దరు చొప్పున ఇంఛార్జ్‌లను నియమించింది. ఈ నేతలు శ్రేణులను సమన్వయం చేసుకుంటూ.. బహిరంగ సభకు భారీ ఎత్తున తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. గతంలో జరిగిన సభలకు పెద్ద ఎత్తున భాజపా కార్యకర్తలు తరలివచ్చారని.. అలాగే మునుగోడు సభ విజయవంతం అవుతోందని.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

మునుగోడు బహిరంగ సభలో పార్టీ చేరికలపై రాష్ట్ర అధిష్ఠానం ప్రధానంగా దృష్టి సారించింది. అమిత్‌ షా సమక్షంలో.. కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతో పాటు నియోజకవర్గంలోని పలువురు కీలక నేతలు భాజపాలో చేరనున్నారు. ఇప్పటికే చౌటుప్పల్‌ ఎంపీపీ వెంకట్‌రెడ్డి తెరాస నుంచి భాజపాలో చేరారు. కాంగ్రెస్‌కి చెందిన సీనియర్‌ నేతలతో పాటు.. తెరాస అసంతృప్త నేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు.. భాజపా చేరికల కమిటీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. మరోవైపు మునుగోడు ఉపఎన్నిక గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వస్తాయని.. భాజపాకు ఈ ఉప ఎన్నిక విజయం ఊపును తీసుకొస్తుందని.. రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర హన్మకొండ జిల్లాలో ఈ నెల 26న ముగియనుండగా.. అక్కడ భారీ బహిరంగ సభకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ నెల్లుట్ల, జనగామ పట్టణంలో 15 కిలోమీటర్లు బండి పాదయాత్ర కొనసాగనుంది.

ఇవీ చదవండి:ఉపఎన్నిక ఇన్​ఛార్జ్​ పదవికి తీవ్రమైన పోటీ, రేసులో ఆ నలుగురు

కోర్టు నుంచి రేప్ కేసు నిందితుడు పరార్, కొట్టి చంపిన స్థానికులు

ABOUT THE AUTHOR

...view details