తెలంగాణ

telangana

'మునుగోడు రిజల్ట్ రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చబోతోంది'

By

Published : Nov 3, 2022, 8:02 PM IST

Bandi Sanjay on Munugode Bypoll Result: మునుగోడులో భాజపా గెలుపు ఖాయమైందని... మళ్లీ రాజగోపాల్‌ రెడ్డి ఎమ్మెల్యే కాబోతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. తెరాస అధికార దుర్వినియోగం, ప్రలోభాలు, ఒత్తిళ్లు, డబ్బు, మద్యంతో బెదిరింపులకు పాల్పడ్డా మునుగోడు ఓటర్లు తెగువ చూపారని ప్రశంసించారు. రాజకీయాలను సర్వనాశనం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay on Munugode Bypoll Result: మునుగోడు ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చబోతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మునుగోడులో భాజపా అభ్యర్థి రాజగోపాల్​రెడ్డి గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెరాస అధికార దుర్వినియోగం, ప్రలోభాలు, ఒత్తిళ్లు, డబ్బు, మద్యంతో బెదిరింపులకు పాల్పడ్డా.. మునుగోడు ఓటర్లు తెగువ చూపారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రక్రియను నాశనం చేశారని బండి సంజయ్ మండిపడ్డారు. పోలింగ్‌ ప్రక్రియను సక్రమంగా నిర్వహించకుండా ఎన్నికల కమిషన్‌ కూడా తప్పు చేసిందని బండి సంజయ్‌ ఆరోపించారు. ఓటు హక్కు వినియోగించుకుని ఇతరులకు ఆదర్శంగా నిలిచిన మునుగోడు యువతకు కృతజ్ఞతలు తెలిపారు. పుట్టకముందే బీఆర్‌ఎస్‌ ఖతమవుతోందని ఈ సందర్భంగా ఆయన జోస్యం చెప్పారు.

ఎన్నికల కమిషనర్​ కేసీఆర్​ జేబులో పనిమనిషి: రాచకొండ సీపీ, నల్గొండ ఎస్పీ తెరాసకు కొమ్ముకాశారని బండి సంజయ్ ఆక్షేపించారు. రాజకీయాలను సర్వనాశనం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల కమిషనర్​ కేసీఆర్​ జేబులో పనిమనిషిగా మారిపోయారని ధ్వజమెత్తారు. పోలింగ్ పై తెరాస పార్టీ ఫేక్ సర్వేలను సర్క్యలేట్ చేస్తోందన్నారు. ఓటు హక్కు వినియోగించుకుని ఇతరులకు ఆదర్శంగా నిలిచిన మునుగోడు యువతకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. రంగం తండా సమస్యలు పరిష్కరించకుంటే మంత్రి కేటీఆర్‌ను ప్రజలు రోడ్డు మీద ఉరికిస్తారని ఎద్దేవా చేశారు.

'మునుగోడు ఫలితంతో రాష్ట్ర రాజకీయాల్లో సమూల మార్పు. నిర్బంధాలు, ఒత్తిళ్ల మధ్య ఓటేసిన మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు. మునుగోడులో భాజపా అభ్యర్థి రాజగోపాల్​రెడ్డి గెలుపు ఖాయం. ఎన్నికల ప్రక్రియను సీఎం కేసీఆర్‌ నాశనం చేశారు. ఎన్నికల కమిషనర్ కేసీఆర్ జేబుమనిషిగా మారారు. పోలింగ్‌పై తెరాస పార్టీ ఫేక్ సర్వేలను ప్రచారం చేస్తోంది.'-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

విజయం ఎవరిని వరించెనో.. తెరాస, భాజపా, కాంగ్రెస్‌, బీఎస్పీ, తెజసతోపాటు వివిధ పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 47 మంది మునుగోడు బరిలో ఉన్నారు. అయితే, ప్రధానంగా తెరాస, భాజపా, కాంగ్రెస్‌ మధ్యనే పోటీ ఉంది. పోలింగ్ ప్రక్రియ ముగిసినప్పటికీ ప్రధాన పార్టీల నేతలకు ఓటరు నాడి తెలియక అంతకంతకూ టెన్షన్‌ పెరుగుతోంది. ఎవరికి వారు తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఫలితం ఎలా ఉంటుందోనని లోలోపల మదనపడుతున్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఉపఎన్నిక సెమీఫైనల్‌గా భావిస్తుండటంతో మునుగోడు ఫలితంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.

ఎన్నికల ప్రక్రియను సీఎం కేసీఆర్‌ నాశనం చేశారు: బండి సంజయ్‌

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details