తెలంగాణ

telangana

ఫీడ్​ ద నీడ్​ వారి 'ది లాస్ట్​ జర్నీ' అంబులెన్స్​

By

Published : Apr 17, 2021, 8:08 PM IST

'ఫీడ్​ ద నీడ్' అనే స్వచ్ఛంద సంస్థ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చింది. కరోనాతో మరణించిన వారిని తరలించేందుకు అంబులెన్స్​ను ఏర్పాటు చేసింది. మేడ్చల్​ జిల్లా నేరేడ్​మెట్​లో రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ అంబులెన్స్​ సేవలను ప్రారంభించారు.

Feed the Need  NGO started ambulance service for covid
ఫీడ్​ ద నీడ్​ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను అభినందిస్తున్న రాచకొండ సీపీ మహేశ్ భగవత్​

కరోనాతో మరణించిన వారిని తరలించడానికి ఫీడ్​ ద నీడ్​ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. మానవతా దృక్పథంతో అంబులెన్స్​ సేవలను అందుబాటులోకి తెచ్చింది. మేడ్చల్​ జిల్లా నేరేడ్​మెట్​లో రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ 'లాస్ట్​ జర్నీ' సేవలను ప్రారంభించారు.

మంచిపని చేసేందుకు ముందుకొచ్చిన ఫీడ్​ ద నీడ్​ సంస్థ వారికి సీపీ ధన్యవాదాలు తెలిపారు. గతేడాది ప్రారంభించిన అంబులెన్స్​ సేవలను మళ్లీ కేసులు పెరుగుతున్నందున పునరుద్ధరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎవరికైనా సేవలు కావాలంటే రాచకొండ కొవిడ్ కంట్రోల్ రూమ్ నంబర్లు 9490617234, 7995404040 ను సంప్రదించవచ్చని సీపీ మహేశ్​ భగవత్​ సూచించారు.

ఇదీచూడండి:అత్యవసరమైతేనే కరోనా రోగులకు బెడ్లు: డీహెచ్​ శ్రీనివాసరావు

ABOUT THE AUTHOR

...view details