తెలంగాణ

telangana

చెత్త సేకరణ కోసం మంచిర్యాలలో విద్యుత్​ ఆటోలు

By

Published : Aug 3, 2019, 11:41 PM IST

చెత్త సేకరణ కోసం మంచిర్యాల పురపాలకలో విద్యుత్​ ఆటోలను ఎమ్మెల్యే దివాకర్​ రావు ప్రారంభించారు. వీటితో ఇంధనం ఆదా అవుతుందన్నారు.

ఆటో ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

మంచిర్యాల పురపాలక పరిధిలోని చెత్త సేకరణ కోసం విద్యుత్ ఆటోలను ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు. పట్టణంలోని చెత్తను సేకరించడం కోసం నాలుగు విద్యుత్ ఆటోలను ఒక్కొక్కటి రూ.1,70,000 కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వీటివల్ల పురపాలక సంఘానికి ఇంధనం ఆదా అవుతుందన్నారు. పట్టణ ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి ఇలాంటి అధునాతనమైన పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పారు.

మంచిర్యాలలో విద్యుత్​ ఆటోలు
Intro:Body:Conclusion:

ABOUT THE AUTHOR

...view details