ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ నేటితో ముగియదని... అది నిరంతర ప్రక్రియని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఖాళీలకు అనుగుణంగా ఏడాదిపాటు ఎప్పటికప్పుడు ప్రమోషన్లు అమలవుతాయని వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉద్యోగులకు పదోన్నతుల ఉత్తర్వులను... వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి అందజేశారు.
కోర్టు కేసుల కారణంగా...
కోర్టులో కేసులు ఉండడం వల్ల ప్రస్తుతం ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టడం లేదని మంత్రి తెలిపారు. పరిష్కారం అయిన వెంటనే ఆ ప్రక్రియ సైతం చేపడతామని చెప్పారు. నిరుద్యోగులకు త్వరలోనే తీపి కబురు వస్తుందని అన్నారు.