తెలంగాణ

telangana

ఆర్మీ జవాన్​కు సన్మానం

By

Published : Feb 1, 2021, 12:53 AM IST

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పారువెల్లలో ఆర్మీ జవాన్​ లక్ష్మణ్​కు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్​ ఛైర్మన్​ అల్వాల కోటి పాల్గొన్నారు.

felcitation to army jawan in karimnagar district
ఆర్మీ జవాన్​కు సన్మానం

ఇండియన్​ ఆర్మీకి ఎంపికై.. శిక్షణ పూర్తి చేసుకున్న కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్లకు చెందిన లక్ష్మణ్​కు స్వేరోస్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీఏసీఎస్ ఛైర్మన్ అల్వాల కోటి జవాన్​ను శాలువాతో సత్కరించారు.

గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించి భారత సైన్యంలో ఉద్యోగం సంపాదించడం గ్రామానికే గర్వకారణమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు సంపత్, ముస్తఫా పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details