తెలంగాణ

telangana

మహేశ్​ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.. వివిధ పార్టీల రాస్తారోకో

By

Published : Dec 25, 2022, 5:17 PM IST

Constable Candidate Mahesh Death
కానిస్టేబుల్​ అభ్యర్థి మహేశ్​ మృతి

Constable Candidate Mahesh Death Many Parties Protested: కానిస్టేబుల్​ అభ్యర్థి మహేశ్​ మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించాయి. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. పోలీస్​ రిక్రూట్​మెంట్​లో 1600 మీటర్ల పరుగు పందెం గురించి పునరాలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Constable candidate Mahesh Death Many parties protested: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థి లింగమల్ల మహేష్ మృతి పట్ల జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రంలో యువకులు, క్రీడాకారులు, పలు పార్టీలు, ప్రజాసంఘాలు ధర్నా చేపట్టారు. మహేశ్​ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరారు. ప్రభుత్వం 1600 మీటర్ల పరుగు పందెం గురించి పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రానికి చెందిన లింగమల్ల మహేశ్ (29) హైదరాబాద్​లోని అంబర్​పేట సీపీఎల్ మైదానంలో శనివారం ఉదయం 1600 మీటర్ల పరుగు పందెంను విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. తర్వాత కొద్దిసేపటికే కుప్పకూలిపోయాడు. పోలీసు అధికారులు అతడిని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయినా పరిస్థితి విషమించడంతో మధ్యాహ్నం చనిపోయాడు. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతి చెందడంతో వారి శోకానికి అంతే లేకుండా పోయింది. మృతుని తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు పోలీసులు పోస్టుమార్టం నిర్వహించకుండానే మృతదేహాన్ని వారికి అప్పగించారు.

మహేశ్ కబడ్డీ, క్రికెట్ క్రీడల్లో ప్రతిభ కనబర్చేవాడు. పలుమార్లు జాతీయ, రాష్ట్రస్థాయిల్లో కబడ్డీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ, శారీరకంగా దృఢంగా ఉండేవాడు. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో హైదరాబాద్​లో ఉంటూ శిక్షణ తీసుకున్నాడు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత పొందిన తరవాత హైదరాబాద్​లోనే ఉంటూ ఈవెంట్ల కోసం నిత్యం సాధన చేస్తూ ఉండేవాడు. పోలీసు ఉద్యోగం సాధించి ఇంటికి వస్తాడనుకున్న కుమారుడు విగతజీవిగా మారడంతో అతడి తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో మహా ముత్తారంలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మృతి చెందిన మహేశ్​ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని మంథని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు కోరారు. పోలీసు నియామకాల్లో 1600 మీటర్ల పరుగు పందెన్ని ప్రభుత్వం ఒకసారి పరిశీలించాలని సూచించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, నిరసనకు మద్దతు తెలిపారు. పోలీస్​ రిక్రూట్​మెంట్​ నిర్వహించే బోర్డు ఒక స్పెషలిస్ట్​ డాక్టర్​ను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.

మహేశ్​ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details