తెలంగాణ

telangana

చలి చంపేస్తోంది... అందరినీ వణికిస్తోంది!

By

Published : Dec 11, 2019, 2:28 PM IST

చలి తీవ్రతకు ప్రజలు వణుకుతున్నారు. పొద్దున్నే బయటకు రావాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

telangana state has more cold
రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి తీవ్రత

రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకి చలి తీవ్రత పెరుగుతోంది. ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలికి పిల్లలు, వృద్ధులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఉదయం మంచు ఎక్కువ కురుస్తున్నందున రాహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారంరోజుల నుంచి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతున్నాయి. ఉపశమనం పొందేందుకు ప్రజలు చలి మంటలు కాసుకుంటున్నారు. చలిని దృష్టిలో పెట్టుకుని చిన్నారులు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి తీవ్రత
TG_KRN_11_11_CHALI PULI_ PKG_ TS10037 ట్రైనీ రిపోర్టర్ కృష్ణమ నాయుడు రిపోర్టర్: సంజీవ్ కుమార్ సెంటర్ కోరుట్ల జిల్లా :జగిత్యాల సెల్ :9394450190 ________€€€€____________€€€€€___________________ యాంకర్ : రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకీ చలి తీవ్రత పెరిగిపోతోంది తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ టు జగిత్యాల జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి చలి తీవ్రత పెరిగిపోతుండడంతో పిల్లలు వృద్ధులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ఆదిలాబాద్ కు సమీపంగా ఉన్నటువంటి మెట్పల్లిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాహనదారులకు తీవ్ర అవస్థని తెచ్చిపెడుతోంది గత వారం రోజుల నుంచి అనూహ్యంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో మంచు ఎక్కువగా కురుస్తుండడంతో మెట్పల్లి జాతీయ రహదారి మంచుతో కప్పబడి ఎదురుగా వచ్చే వాహనాలు కనపడకపోవడం తో లైట్లు వేసుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ముఖ్యంగా వృద్ధులు పిల్లలు తప్పనిసరిగా ఉన్ని దుస్తులు ధరించాలని చలి తీవ్రత తగ్గిన తగ్గిన తర్వాత బయటకు రావాలంటూ వైద్యులు సూచిస్తున్నారు ఉదయం 8:00 అవుతున్నా కూడా మంచు కురుస్తుండడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందు చలి తీవ్రత కారణంగా ఉదయం చేసేటటువంటి పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు వివిధ వృత్తులు చేసుకునేవారు చలి తీవ్రతకు నానా అవస్థలు పడుతూ పనుల్లో నిమగ్నం అవుతున్నారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి పనులు చేసుకునేవారు చలితో భయపడి సమయాన్ని వాయిదా వేసుకుంటూ ఉదయం పూట పనులు చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు మెట్పల్లి జాతీయ రహదారిపై చలి తీవ్రత కారణంగా ప్రజలు లేక ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా కనిపిస్తుంది చలి ఎప్పుడు తగ్గుతుందో అని ఎదురు చూస్తూ ప్రజలు ఎదురుచూస్తున్నారు.... .story+ voxpox...... పిటుసి..... కృష్ణమ నాయుడు ట్రైనీ రిపోర్టర్

ABOUT THE AUTHOR

...view details