MLC Jeevan reddy on Charges Hike: తెరాస, భాజపా కలిసి రైతుల సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. రైతులను తప్పుదోవ పట్టించేందుకు ధర్నాలు చేస్తున్నాయని విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన జీవన్ రెడ్డి.. ధరల పెంపును వ్యతిరేకిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇరు ప్రభుత్వాలు తోడుదొంగలాట ఆపి.. ప్రజలపై మోపిన పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకు పడిన బకాయి రూ. 12 వేల కోట్లు చెల్లించలేక.. విద్యుత్ ఛార్జీలు పెంచింది. ముందుగా ప్రభుత్వం బకాయి సొమ్ము చెల్లించి విద్యుత్ ఛార్జీల పెంపు ఉపసంహరించుకోవాలి. 2014లో పెట్రోలుపై 14 శాతం పన్ను ఉంటే.. 35 శాతం పెంచారు. డీజిల్పై 12.50 శాతం ఉన్న పన్నును 27 శాతానికి పెంచారు. ప్రజలపై పన్నుల భారాన్ని మోపి ధర్నాలు చేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.-జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ