తెలంగాణ

telangana

కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణపై దాఖలైన పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు

By

Published : Aug 1, 2022, 8:08 PM IST

Updated : Aug 1, 2022, 9:49 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణపై దాఖలైన పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు

20:06 August 01

కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణపై దాఖలైన పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు

కాళేశ్వరం ప్రాజెక్టు అప్రోచ్ కాలువలు, డిస్ట్రిబ్యూటరీ ఛానెళ్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన భూ సేకరణ నోటిఫికేషన్​ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. భూ సేకరణను సవాల్ చేస్తూ నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఎలిమినేడు గ్రామానికి చెందిన పలువురు భూ నిర్వాసిత రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.నందా ధర్మాసనం విచారణ జరిపింది. కాలువలకు భూసేకరణ కోసం 2017లో జారీ చేసిన నోటిఫికేషన్ గడువు ముగిసినప్పటికీ.. ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోందని పిటిషనర్లు వాదించారు. పరిహారం చెల్లించకుండా బలవంతంగా భూములు స్వాధీనం చేసుకుంటోందన్నారు.

పిటిషనర్లు మినహా గ్రామంలోని రైతులందరూ పరిహారం తీసుకున్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. పిటిషనర్లు కూడా ప్రభుత్వం ప్రతిపాదించిన పరిహారం ప్యాకేజీని గతంలో అంగీకరించారని.. ఇప్పుడు మళ్లీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. ప్రభుత్వం ప్యాకేజీని అంగీకరించి.. ఆ తర్వాత పిటిషన్లు వేయడం సరికాదని అభిప్రాయపడింది.

ఇవీ చూడండి..

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా.. అటు వైపే చూడని అధికారులు

Last Updated :Aug 1, 2022, 9:49 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details