తెలంగాణ

telangana

KRMB: 'ఏపీపై తెలంగాణ ఫిర్యాదు.. ఆర్డీఎస్ పనులు ఆపేలా ఆదేశాలివ్వండి'

By

Published : Jul 12, 2022, 4:56 PM IST

Updated : Jul 12, 2022, 6:44 PM IST

KRMB
KRMB

16:54 July 12

KRMB: కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాసిన ఈఎన్‌సీ మురళీధర్

KRMB: ఆర్డీఎస్ కుడికాల్వ పనులపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. కేఆర్‌ఎంబీ ఆదేశాలకు విరుద్ధంగా ఆర్డీఎస్​ కుడికాల్వ పనులు కొనసాగిస్తున్నారని తెలిపింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. ఆర్డీఎస్​ కుడికాల్వ పనులు కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బోర్డు అనుమతి లేకున్నా ఏపీ పనులు కొనసాగిస్తోందని కేఆర్​ఎంబీకి లేఖలో వివరించారు. బోర్డు ఆదేశాలకు విరుద్ధంగా పనులు కొనసాగిస్తున్నారని తెలిపారు. పనులు ఆపేలా ఏపీని నిలువరించాలని కేఆర్​ఎంబీని లేఖలో కోరింది.

Last Updated : Jul 12, 2022, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details