తెలంగాణ

telangana

Telangana Assembly Sessions 2023 : నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. వ్యూహ, ప్రతివ్యూహాలతో 'సై' అంటున్న పార్టీలు

By

Published : Aug 2, 2023, 8:37 PM IST

Updated : Aug 3, 2023, 6:29 AM IST

Telangana Assembly Sessions 2023 : అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి జరగనున్నాయి. ఎన్నికలకు ముందు ఇవే చివరి సమావేశాలు కాగా.. అధికార, విపక్ష పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఈ విడత... మూడు, నాలుగు రోజులు సమావేశాలు ఉండొచ్చని భావిస్తున్నారు. నేడు ఉదయం కంటోన్మెంట్ దివంగత శాసనసభ్యుడు సాయన్నకు సంతాపం తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. అందులో సమావేశాలు ఎన్నిరోజులు జరపాలనే అంశం ఖరారు కానుంది.

Telangana Assembly Sessions 2023
Telangana Assembly Sessions 2023

Telangana Assembly Sessions Starts From Today : తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సభలో ఇరుకున పెట్టేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులతో సిద్ధమవుతున్నాయి. ఈ విడత... మూడు, నాలుగు రోజులు సమావేశాలు ఉండొచ్చని భావిస్తున్నారు.బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 12న ముగిశాయి. ఆరు నెలల్లో కనీసం ఒకసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నందున.. ఈరోజు నుంచి జరిపేందుకు ఏర్పాట్లు చేశారు.

Telangana Assembly Monsoon Sessions 2023 : మూడు, నాలుగు రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు ఉండొచ్చునని భావిస్తున్నారు. ఇవాళ ఉదయం కంటోన్మెంట్ దివంగత శాసనసభ్యుడు సాయన్నకు సంతాపం వ్యక్తం చేయనున్నారు. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. అందులో సమావేశాలు ఎన్నిరోజులు జరపాలనే అంశం ఖరారు కానుంది. ఎన్నికలు నవంబరు లేదా డిసెంబరులో జరిగే అవకాశం ఉంది. ఫలితంగా ఇవే చివరి సమావేశాలని భావిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ... అసెంబ్లీ, మండలిలోనూ దూకుడుగా వెళ్లేందుకు కసరత్తు చేస్తున్నాయి.

వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్న పార్టీలు : వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలనికాంగ్రెస్, బీజేపీ వ్యూహ రచన కాగా.. విపక్షాల ఎత్తులను తిప్పికొట్టడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సభా వేదికగా ప్రజల ముందుంచాలని అధికార పార్టీ ప్రతివ్యూహం.భారీ వర్షాలు, వరదలకు ప్రాణ, పంట నష్టం, ధరణి, డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపు వంటి అంశాలను ప్రస్తావించాలని ప్రతిపక్షాలు ప్రణాళిక చేస్తున్నాయి. మరోవైపు ఉచిత విద్యుత్​పై కాంగ్రెస్ వైఖరి, రాష్ట్రానికి కేంద్ర సాయం వంటి అంశాలను లేవనెత్తి విపక్షాలపై ఎదురుదాడికి అధికార పార్టీ సిద్ధమవుతోంది. మూడు, నాలుగు రోజుల పాటు గత సమావేశాలకు భిన్నంగా వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ తిప్పి పంపిన నాలుగు బిల్లులను మళ్లీ సభలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ చర్చ సందర్భంగా కేంద్రం, బీజేపీ వైఖరిపై ధ్వజమెత్తాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

ఈ బిల్లులను సమావేశాలలో ప్రవేశపెట్టనున్న సర్కార్ :ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, టిమ్స్ ఆస్పత్రుల బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సమావేశాల నిర్వహణపై అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ అధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలని.. సభ్యులు అడిగిన వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని స్పష్టం చేశారు.

BRS CandidatesTelangana Assembly Elections 2023 : ప్రస్తుత ప్రభుత్వానికి మంత్రివర్గ సమావేశాలు మళ్లీ జరగడానికి అవకాశమున్నా... ఇవాళ్టి నుంచి జరిగే శాసనసభ సమావేశాలే చివరివి కానున్నాయి. సెప్టెంబరు రెండు లేదా మూడో వారం నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 18 తర్వాత ఏ రోజైనా బీఆర్​ఎస్​ తనమొదటి విడత అభ్యర్థులను ప్రకటించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 85 నుంచి 90 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించనున్నారు. నిర్ణయం తీసుకోలేక కొంతకాలం వేచి చూసే స్థానాలు తప్ప... మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

ఇవీ చదవండి :

Last Updated : Aug 3, 2023, 6:29 AM IST

ABOUT THE AUTHOR

...view details