తెలంగాణ

telangana

టీడీపీ శ్రేణులకు శుభవార్త.. లోకేశ్​ పాదయాత్ర పేరేంటో తెలుసా?

By

Published : Dec 27, 2022, 10:01 PM IST

Updated : Dec 27, 2022, 10:22 PM IST

Nara Lokesh Padayatra in AP: ఏపీ టీడీపీ కార్యకర్తలకు శుభవార్త అందనుంది. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ మహాపాదయాత్రకు సంబంధించిన పేరు, ముహూర్తం ఖరారు అయ్యాయి. దీని వివరాలను పార్టీ ముఖ్య నేతలు బుధవారం మీడియా సమావేశంలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

Nara Lokesh Padayatra in AP
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​

Nara Lokesh Padayatra in AP: టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్​లో మహాపాదయాత్రకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల 27వ తేదీ నుంచి ఏపీలోని కుప్పం వేదికగా ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. ఇంకో నెల రోజుల సమయం ఉండటంతో పార్టీ నేతలు దీనికి సంబంధించిన రూట్ మ్యాప్​ను ఖరారు చేస్తున్నారు.

హంగూ..ఆర్బాటం లేకుండా సాదాసీదాగా పాదయాత్ర జరిగేలా చూడాలని లోకేశ్ సూచించారు. పాదయాత్రకు పేరు, ముహూర్తం ఖరారైనట్టు సమాచారం అందింది. దీనికి సంబంధించిన వివరాలను పార్టీ ముఖ్య నేతలు రేపు మీడియా సమావేశంలో ప్రకటించనున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి:

Last Updated :Dec 27, 2022, 10:22 PM IST

ABOUT THE AUTHOR

...view details