తెలంగాణ

telangana

Ganja gang arrested in Cyberabad : సైబరాబాద్​లో భారీగా గంజాయి పట్టివేత.. విలువ ఎంతంటే?

By

Published : Jun 12, 2023, 3:44 PM IST

Updated : Jun 12, 2023, 4:36 PM IST

SOT police caught ganja gang in Hyderabad : సైబరాబాద్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు ముఠాల నుంచి 910 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్​వోటీ, స్థానిక పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో 8 మందిని అరెస్ట్‌ చేసి రూ. 2కోట్ల 80 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

Ganjai gang arrested
Ganjai gang arrested

సైబరాబాద్​లో భారీగా గంజాయి పట్టివేత.. విలువ ఎంతంటే?

Ganja gang arrested in Cyberabad 910 kg seized : హైదరాబాద్​లోని సైబరాబాద్​ పరిధిలోని గంజాయిని అక్రమంగా తరలిస్తున్న 3 అంతర్రాష్ట్ర ముఠాలను ఎస్​వోటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు గంజాయిని ఏవోబీ నుంచి మహారాష్ట్రకు సరఫరా చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మొదట బాలానగర్ జోన్ పరిధిలో తనిఖీలు చేపట్టిన పోలీసులు 758 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు డీసీఎం వాహనంలో తౌడు బస్తాల మధ్య గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శంషాబాద్‌ పరిధిలో గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుల నుంచి 144 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ పీఎస్‌ పరిధిలో గంజాయి సరఫరా చేస్తున్న మరో ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 8 కిలోల గంజాయి, చరవాణి స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. మొత్తం సైబరాబాద్ పరిధిలో 3 ముఠాల నుంచి 910 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్​వోటీ పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.2.80 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. మొత్తం ఈ కేసులో 8 మందిని అరెస్టు చేశారు.

Ganjai gang arrested in Cyberabad : గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న వాటిని తరలించే నిందితుల ఆగడాలు ఏ మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్​లో విక్రయిస్తున్నారు. కొందరు హైదరాబాద్​ కేంద్రంగా చేసుకొని ఇక్కడి నుంచి పక్కరాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్​ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నిర్వాహకం​ చూసి పోలీసులే ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఎస్కార్ట్​ రూపంలో ముందు ఒక వాహనం పెట్టుకొని మిగిలిన వాహనంలో గంజాయి రవాణా చేస్తూ.. ఏ మాత్రం పోలీసులకు అనుమానం రాకుండా గంజాయి తరలిస్తు పట్టుబడ్డారు. వారి ప్లాన్​​ చూసి పోలీసులే కంగు తిన్నారు. తాజాగా ఇవాళ అరెస్టు చేసిన ముఠా సైతం గంజాయి రవాణాకు డీసీఎం వాహనం ఏర్పాటు చేసుకొని పశువులకు దాణాగా ఉపయోగించే తౌడు బస్తాల మధ్య రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా ఒక బాక్స్​లో కింద గంజాయి పైన గాజులు పెట్టి రవాణా చేస్తున్నారు.

"సైబరాబాద్ జోన్​ పరిధిలో ఇవాళ భారీగా గంజాయి పట్టుకున్నాం. స్థానిక పోలీసులు, ఎస్​వోటీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్​లో పట్టివేత 3 అంతర్రాష్ట్ర ముఠాలను పట్టుకున్నాం. నిందితులు ఏవోబీ నుంచి మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తున్నారు. బాలానగర్ జోన్ పరిధిలో 758 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాం. శంషాబాద్‌ పరిధిలో ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశాం. వారి నుంచి 144 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. చందానగర్ పీఎస్‌ పరిధిలో మరో ముఠా అరెస్ట్ చేశాం. మొత్తం 3 ముఠాలు నుంచి 910 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాం. దాని విలువ సుమారు రూ.2.80 కోట్లు ఉంటుంది. మొత్తం 8 మందిని అరెస్టు చేశాం." - స్టీఫెన్‌ రవీంద్ర, సైబరాబాద్‌ సీపీ

ఇవీ చదవండి:

Last Updated : Jun 12, 2023, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details