తెలంగాణ

telangana

జల్లికట్టుకు పోలీసుల ఆంక్షలు.. తగ్గేదేలే అంటున్న ప్రజలు

By

Published : Jan 16, 2023, 8:24 AM IST

Updated : Jan 16, 2023, 10:41 AM IST

Jallikattu At Rangampet Village: కనుమ పండుగను తమదైన రీతిలో ఘనంగా జరుపుకుంటారు ఏపీలోనితిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎ. రంగంపేట ప్రజలు. కనుమ రోజున పశువుల పండుగ నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. పోలీసులు ఆంక్షలు పెట్టినా.. మా సంప్రదాయం మాదేనంటూ.. వారు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Jallikattu At Rangampet Village
Jallikattu At Rangampet Village

జల్లికట్టుకు పోలీసుల ఆంక్షలు తగ్గేదేలే అంటున్న ప్రజలు

Jallikattu At Rangampet Village: పశువుల పండుగను నిర్వహించేందుకు తిరుపతి జిల్లా ఎ. రంగంపేట సన్నద్ధమైంది. తరాలుగా ఆనవాయితీగా వస్తోన్న పశువుల పండుగను ఎప్పట్లాగే ఘనంగా నిర్వహిస్తామని రంగంపేట ప్రజలు చెబుతున్నారు. పోలీసులు ఆంక్షలు పెట్టినా.. మా సంప్రదాయం మాదేనంటూ.. ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

పశువుల పండుగ ఆనవాయితీ..యువత పరుగులు: కనుమ పండుగను తమదైన రీతిలో ఘనంగా జరుపుకుంటారు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎ. రంగంపేట ప్రజలు. కనుమ రోజున పశువుల పండుగ నిర్వహించడం ఎ.రంగంపేటలో ఆనవాయితీగా వస్తోంది. పశువులను అందంగా అలంకరించి వాటి కొమ్ములకు చెక్క పలకలు, పసుపు టవళ్లు కడతారు. అనంతరం వాటిని పరిగెత్తిస్తారు. అలా పరుగులు తీస్తున్న పశువుల కొమ్ములకు కట్టినవాటిని సొంతం చేసుకునేందుకు.. యువత వాటితో పాటు పరుగులు పెడతారు. అలా పశువుల కొమ్ములకు కట్టినవాటిని సాధించడాన్ని గొప్పగా వారు భావిస్తారు. ఈ క్రమంలో అనేక మందికి గాయాలవుతుంటాయి.

ఎ. రంగంపేట ప్రజలు ఏర్పాట్లు: దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ క్రీడపై పోలీసులు కొంత కాలంగా ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు. వీటిని కలిసికట్టుగా ఎదుర్కొంటూ వస్తున్న ఎ.రంగంపేట ప్రజలు పశువుల పండుగను నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో నేడు కనుమ సందర్భంగా పశువుల పండుగను నిర్వహించేందుకు ఎ.రంగంపేట ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

తమిళనాడు జల్లికట్టు కాదు..పశువులపై మమకారం: పశువుల పండుగను తమిళనాడు జల్లికట్టుతో పోల్చడాన్ని గ్రామస్థులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇది జల్లికట్టు కాదని తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరిస్తూ పశువులపై మమకారంతోనే ఈ పండుగను జరుపుకుంటున్నామని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చే వేలాది మంది సందర్శకుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

పోలీసుల ఆంక్షలు.. గ్రామస్థులు స్పష్టం:పోలీసులు మాత్రం రెండు రోజుల ముందు నుంచే పశువుల పండుగపై ఆంక్షలు విధిస్తూ హెచ్చరికలు జారీచేశారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లలో హెచ్చరిక బోర్డులు ఉంచారు. అయినా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ... పశువుల పండుగను నిర్వహించిన తీరతామని గ్రామస్థులు స్పష్టం చేశారు.


ఇవీ చదవండి

Last Updated :Jan 16, 2023, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details