Salu Dora Selavu Dora Digital Board: హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద సాలు దొర.. సెలవు దొర డిజిటల్ బోర్డు తాజాగా మళ్లీ ప్రత్యక్షమైంది. ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని సూచిస్తూ.. భాజపా గతంలో కౌంట్డౌన్ బోర్డు ఏర్పాటు చేసింది. ఈ డిజిటల్ బోర్డుపై రాజకీయ దుమారం రేగింది. జీహెచ్ఎంసీ సైతం బోర్డు ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీసులు తొలగించమని చెప్పడంతో.. భాజపా నేతలు కార్యాలయం వద్ద బోర్డును తొలగించారు.
తాజాగా కేసీఆర్ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న భాజపా రాష్ట్ర నాయకత్వం.. మళ్లీ పార్టీ కార్యాలయం అవరణలో 'సాలు దొర సెలవు దొర' డిజిటల్ బోర్డును ప్రారంభించింది. సీఎం కేసీఆర్ గద్దె దిగే వరకు ఈ కౌంట్ డౌన్ బోర్డు కొనసాగుతుందని పార్టీ నేతలు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:
Last Updated :Nov 20, 2022, 1:06 PM IST