రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌ చేస్తే ఇకపై భారీ జరిమానా..!

author img

By

Published : Nov 20, 2022, 7:40 AM IST

Hyderabad Traffic Police

ఇకపై ద్విచక్రవాహనంపై వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. బైక్​పై ముగ్గురు ప్రయాణించినా, వ్యతిరేక దిశలో డ్రైవ్ చేసినా భారీ జరిమానా విధిస్తామని ప్రకటించారు. నియమాలను ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు మరింత కఠినతరం చేయనున్నారు. వ్యతిరేక దిశలో డ్రైవింగ్‌ చేసినా, ద్విచక్రవాహనంపై ముగ్గురు ప్రయాణించినా జరిమానా విధిస్తామని ప్రకటించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే రూ.1,700, ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1,200 జరిమానా విధించనున్నారు. ఈ నెల 28 నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నియమాలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

వాహనదారులు ట్రాఫిక్ రూల్స్‌ పాటించడం ద్వారా ప్రాణనష్టం నిరోధించవచ్చని సూచిస్తున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లు, ఆపరేషన్ రోప్ వంటివి కేవలం ట్రాఫిక్ నియంత్రణ, వాహనదారుల భద్రతే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత మూడేళ్లుగా వ్యతిరేక దిశ, ట్రిపుల్ డ్రైవింగ్‌ చేసి దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.