తెలంగాణ

telangana

Prashanth Reddy Review Meeting : 'రైతులకు సాగు నీటి కష్టాలు లేకుండా చర్యలు చేపట్టాలి'

By

Published : Jul 2, 2023, 10:27 PM IST

Prashanth Reddy Review Meeting On Irrigation : సీఎం కేసీఆర్​తో జరిగిన ఉన్నత సమావేశం అనంతరం నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రైతులకు సాగు నీటిని అందించేందుకు కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ రైతులకు వానాకాలం సాగుకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు.

Prashanth Reddy
Prashanth Reddy

Prashant Reddy Meeting With Officials : పునరుజ్జీవ పథకం ద్వారా కాళేశ్వరం జలాలను రోజుకు అర టీఎంసీ చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీలను ఎస్సారెస్పీలోకి ఎత్తిపోయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానించినట్లు రహదారుల, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నీటి పారుదలపై సీఎం సమీక్ష అనంతరం ఉమ్మడి నిజామాబాద్ నీటి పారుదలశాఖ అధికారులతో మంత్రి సచివాలయంలో సమావేశమయ్యారు. వానాకాలం పంటకు సాగునీరు అందించే అంశంపై సమీక్షించారు. రైతులకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ రైతులకు వానాకాలం సాగుకు ఇబ్బందిలేకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

కాళేశ్వరం జలాలను పునరుజ్జీవ పథకం ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్​లో నింపి జిల్లా ఆయకట్టుకు నీరు అందించనున్నట్లు చెప్పారు. వర్షం నీరు చుక్క ఎస్సారెస్పీలోకి రాకున్నా.. కాళేశ్వరం జలాలతో సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించారని మంత్రి వివరించారు. ఎల్ఎండీ ఎగువ భాగం ఆయకట్టుకు 50 టీఎంసీలు అవసరమని.. ఎస్సారెస్పీలో ప్రస్తుతం 20 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. పునరుజ్జీవ పథకం ద్వారా కాళేశ్వరం జలాలు రోజుకు అరటీఎంసీ చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీలను ఎస్సారెస్పీలోకి ఎత్తిపోయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని చెప్పారు.

Prashant Reddy Participated KCR Meeting : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు వీలుగా గుత్పా, అలీసాగర్, లక్ష్మి కెనాల్, చౌట్ పల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల పథకాలు, కాకతీయ కెనాల్ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు సిద్ధం చేయాలని ఇంజనీర్లను ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. నిజాంసాగర్​లో ఐదు టీఏంసీల నీటి నిల్వలు ఉన్నాయని, వానాకాలం సాగు కోసం రైతులకు నీటిని విడుదల చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

Prashant Reddy Participated In High Level Meeting Of KCR : గోదావరి పరివాహక ప్రాంతం పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు నీటి పారుదల శాఖ ఈఎన్సీలు, చీఫ్ ఇంజినీర్లతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగు, సాగు నీటి అవసరాల, గోదావరి పరివాహక ప్రాంతంలోని పరిస్థితులపై సమీక్షించారు. గోదావరి పరిధిలోని ప్రాజెక్టులలో నీటి నిల్వలు, తాగు, సాగు, వర్షపాతం నీటి అవసరాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతం నీటి పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకొని.. అవసరాలకు నీరు ఏ విధంగా ఉపయోగించాలో నిర్ణయం తీసుకున్నారు. సాగు, తాగు నీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని సమావేశంలో అధికారులను ఆదేశించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details