శ్రీశైలం జలాశయానికి (sreesailam project) వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి 27,524 క్యూసెక్కుల వరద.. జలాశయానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 823.50 అడుగులకు నీరు చేరింది. గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 43.5460 టీఎంసీలకు చేరింది.
మరోవైపు.. శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. విద్యుదుత్పత్తి చేసి 25,427 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన వర్షాలు కురుస్తున్న కారణంగా.. వరద రాక సైతం కొనసాగే అవకాశం ఉంది.
Last Updated :Jun 30, 2021, 10:55 AM IST