తెలంగాణ

telangana

శ్రీశైలం, సాగర్​కు భారీగా వరద.. దిగువకు నీటి విడుదల

By

Published : Oct 13, 2019, 12:57 PM IST

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు మరోసారి జలకళ వచ్చింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలంలో 3 గేట్లు, నాగార్జున సాగర్​లో 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

శ్రీశైలం, సాగర్​కు భారీగా వరద.. దిగువకు నీటి విడుదల

శ్రీశైలం మళ్లీ నిండింది. నాగార్జున సాగర్ మరోసారి పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు.. రెండు ప్రాజెక్టుల్లో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరింది. జురాల ప్రాజెక్టులో ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున.. శ్రీశైలానికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్ ​ఫ్లో 1,14,627 క్యూసెక్కులుగా ఉంది. ఔట్​ ఫ్లో 84, 225 క్యూసెక్కులుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. ఈ సీజన్​లో ఆరోసారి గేట్లు ఎత్తారు.

సాగర్​లోనూ జలకళ

శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్​కు నీటి ప్రహహాం భారీగా కొనసాగుతోంది. సాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు ఉండగా..ప్రస్తుతం 589.90 అడుగుల మేర ఉంది. నీటి నిల్వ 311.14 టీఎంసీలు ఉంది. ప్రస్తుతం 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

ఇదీ చూడండి: నిండుకుండలా మారిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు

Intro:Body:Conclusion:

ABOUT THE AUTHOR

...view details