నీతి అయోగ్(Nithi Ayog) జాబితాలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి(Basavatarakam indo american Cancer Hospital)కి చోటు దక్కడంపై నందమూరి తారకరామారావు కుమారుడు రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణకు హాస్పిటల్ చేసిన కృషికి దక్కిన ప్రతిఫలమిది అని చెప్పుకొచ్చారు. నీతి అయోగ్.. నాట్ ఫర్ ప్రాఫిట్ హాస్పిటల్స్ పేరుతో మంగళవారం విడుదల చేసిన నివేదికలో తెలుగు రాష్ట్రాల్లోని రెండు ఆసుపత్రులు గురించి ప్రస్తావించింది. ఈ నివేదికలో ఏపీలోని శ్రీ సత్యసాయి పుట్టపర్తి వైద్యాలయంకు(Sri Sathya Sai Puttaparthi hospital) కూడా చోటు దక్కింది.
బసవతారకం ఇండో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ నీతి అయోగ్ జాబితాలో చేరడం ప్రతిష్ఠాత్మకమైన గుర్తింపు. దేశానికి ఆసుపత్రి వర్గాలు చేసిన త్యాగం ఎంతో గొప్పది. బసవతారకం కుటుంబంలోని ప్రతి సభ్యుడి తరఫున.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. ప్రైవేటు ఆసుపత్రులతో పోలిస్తే బసవతారకం తక్కువ ఫీజు వసూలు చేస్తోంది. 2000వ సంవత్సరంలో ప్రారంభమై.. ఇప్పటిదాకా 1, 65, 000 మంది క్యాన్సర్ రోగులకు వైద్య సేవలను అందించింది.
- నందమూరి రామకృష్ణ
10-20% తక్కువ ఛార్జీలు