ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీనివాస్ గౌడ్ను వెంటనే మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని భాజపా ఎమ్మెల్యే రఘునందన్రావు డిమాండ్ చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి రిటైర్డ్ అయ్యాక వచ్చే సలహాదారు పోస్టు కోసమే ఈ ఘటనపై చర్యలు తీసుకోవడంలేదని మండిపడ్డారు. మహబూబ్నగర్లో ఏ చట్ట ప్రకారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ తుపాకి తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారని ఆయన ప్రశ్నించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ఏమైనా లైసెన్స్ ఉందా అని రఘునందన్రావు అడిగారు. ఈ విషయం గురించి మాట్లాడేందుకు డీజీపీ ఆఫీసుకు ఎప్పుడు రమ్మంటారని ప్రశ్నించారు. మంత్రి పేల్చిన తుపాకిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలని తెలిపారు. లేదంటే రిట్ పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని రఘునందన్రావు కోరారు.
"భారతీయ శిక్షా స్మృతి, రాజ్యాగం ప్రకారం ఈ చట్టాలలో ఎక్కడ అన్న ఎస్పీకి ఒక ప్రైవేట్ వ్యక్తికి తుపాకీ ఇచ్చి కాల్చమని చెప్పే చట్టముందా. ఒక బాధ్యత గల మంత్రి తన గన్మెన్ దగ్గర నుంచి తీసుకున్నారు. దాని కప్పి పుచ్చుకోవాడానికి ఎస్పీ నేనే ఆ తుపాకీ ఇచ్చాను అని చెప్పారు. దీనికి బాధ్యతగా ఎస్పీపై చర్యలు తీసుకోవాలి. శ్రీనివాస్ గౌడ్ను మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలి. - రఘునందన్రావు, భాజపా ఎమ్మెల్యే