తెలంగాణ

telangana

కుటిల రాజకీయ విధానాలు విచారకరం: శ్రీధర్​ బాబు

By

Published : Nov 26, 2020, 6:27 PM IST

Updated : Nov 26, 2020, 6:33 PM IST

మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహానీయులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

కుటిల రాజకీయ విధానాలు విచారకరం: శ్రీధరబాబు
కుటిల రాజకీయ విధానాలు విచారకరం: శ్రీధరబాబు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్ సమాధులపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు. చవకబారు రాజకీయ ప్రచారం, ప్రయోజనాల కోసం మహానీయులను తూలనాడే కుటిల రాజకీయ విధానాలు విచారకరమన్న శ్రీధర్‌బాబు... ప్రజాస్వామ్యంలో ఇటువంటి కుహనా విధానాలకు తావులేదని పేర్కొన్నారు.

తెరాస చేతకానితనాన్ని అలుసుగా తీసుకుని మహానీయులపై అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆత్మాభిమానాన్ని తమ కుటిల రాజకీయ ప్రయోజనాల కోసం తెరాస, ఎంఐఎం పార్టీల వైఖరిని ఖండిస్తున్నా. ఆ పార్టీలు క్షమాపణలు చెప్పాలి. లేకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.

Last Updated :Nov 26, 2020, 6:33 PM IST

ABOUT THE AUTHOR

...view details