తెలంగాణ

telangana

krmb:ఈ నెల 12న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం

By

Published : Oct 7, 2021, 5:35 PM IST

Updated : Oct 7, 2021, 8:49 PM IST

krmb
krmb

17:33 October 07

ఈ నెల 12న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం

 గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయమై చర్చించేందుకు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు మంగళవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. అమలు కార్యాచరణ పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ తరఫున జలవనరులశాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ హైదరాబాద్​లో సమీక్ష నిర్వహించారు. రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారం, వివరాలను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఛైర్మన్లు వివరించారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలు కావాల్సి ఉన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాలతో మరోదఫా చర్చించేందుకు బోర్డులు నిర్ణయించాయి. ఇందుకోసం ఈ నెల 12వ తేదీన కృష్ణా, గోదావరి బోర్డులు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశాయి. 

 బోర్డుల ఛైర్మన్ నేతృత్వంలో జరిగే సమావేశాల్లో బోర్డుల సభ్యులు, రెండు రాష్ట్రాల కార్యదర్శులు, ఈఎన్సీలు పాల్గొంటారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు, సంబంధిత అంశాలపై ప్రత్యేక సమావేశంలో చర్చిస్తారు. బోర్డు సమావేశాలకు ముందు ఆదివారం ఉపసంఘాలు సమావేశం కానున్నాయి. అక్టోబర్ 14వ తేదీ నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రానున్న నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను మొదటగా బోర్డుల పరిధిలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చూడండి:Water Dispute between Telugu States: 'కేంద్ర జలశక్తి'తో కేఆర్​ఎంబీ, జీఆర్​ఎంబీ ఛైర్మన్ల భేటీ

Last Updated : Oct 7, 2021, 8:49 PM IST

ABOUT THE AUTHOR

...view details