Kishan Reddy Interesting Comments in Hyderabad : ఆర్టికల్ 370ని తొలగించిన చరిత్ర నరేంద్ర మోదీ ప్రభుత్వానిదేనని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి (Kishan Reddy) అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తెచ్చింది మోదీ సర్కార్ అని గుర్తు చేశారు. పాక్ ఐఎస్ఐ ద్వారా రూ.లక్షల కోట్లు భారత్లో చలామణి అయ్యేదని.. కానీ అక్రమ చలామణి కట్టడికి పెద్ద నోట్లు రద్దు చేసిన చరిత్ర బీజేపీదేనని పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Kishan Reddy Fires on CM KCR : '30 రోజులు పోరాడితే రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడొచ్చు'
Kishan Reddy Fires on BRS Govt :ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం కిషన్రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. భవిష్యత్లో పార్టీలోకి భారీగా చేరికలుంటాయని కిషన్రెడ్డి తెలిపారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని అన్నారు. పోరాటాలు, ఉద్యమాలు చేసిన తర్వాత కూడా.. తెలంగాణ మాఫియా చేతుల్లో బందీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ (KCR) అవినీతి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు స్పందిస్తున్నారని తెలిపారు. బీజేపీపై కొంత మంది కారు కూతలు కూస్తున్నారని కిషన్రెడ్డి మండిపడ్డారు.
Kishan Reddy Comments on BRS and Congress : తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేద్దామని కిషన్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు పని చేద్దామని.. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి.. బీఆర్ఎస్ (BRS) బీ టీమ్గా ఉందని ఆరోపించారు. హస్తం పార్టీ, భారత్ రాష్ట్ర సమితి రెండు పార్టీలకు.. ఏ టీమ్ ఎంఐఎం పార్టీ అని విమర్శించారు. బీజేపీ తెలంగాణ ప్రజల టీమ్ అని అన్నారు. అధికారం శాశ్వతం కాదని.. ప్రతిపక్షంలో కూర్చోవడానికి తాము సిద్ధమని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు.