తెలంగాణ

telangana

GOVERNOR: తెలంగాణలో బాధ్యతలు నిర్వహించడం ఆనందంగా ఉంది: తమిళిసై

By

Published : May 8, 2022, 12:31 PM IST

Updated : May 8, 2022, 12:47 PM IST

GOVERNOR
గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ()

తెలంగాణ నవజాత శిశువుతో సమానమని గవర్నర్‌ తమిళిసై అన్నారు. తెలంగాణలో గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రపంచ రోడ్‌క్రాస్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పాల్గొన్నారు. ఇటీవలే తన తల్లిని కోల్పోయానని గవర్నర్‌ భావోద్వేగానికి లోనయ్యారు.

తెలంగాణలో గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించడం ఆనందంగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. రెండు రాష్ట్రాల్లో గవర్నర్‌ వ్యవస్థను ఎలా నిర్వహిస్తారని నాపై అనుమానం వ్యక్తం చేశారని ఆమె గుర్తు చేశారు. హైదరాబాద్​లోని రాజ్‌భవన్‌లో ప్రపంచ రోడ్‌క్రాస్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పాల్గొన్నారు. రాజ్‌భవన్‌కు వచ్చిన మాతృమూర్తులకు బహుమతులు అందించారు. చిన్నారులను స్వయంగా ఎత్తుకుని ముద్దాడారు.

మాతృ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్

పాత కొత్త తరాలను కలుపుతూ ఇటివలే మాతృత్వాన్ని పొందిన మహిళలతో పాటు 60 ఏళ్లు పైబడిన తల్లులతో కలిసి గవర్నర్ వేడుకలు నిర్వహించారు. మాతృత్వపు గొప్పతనాన్ని తమిళిసై వివరించారు. ఉద్యోగంతో పాటు పిల్లలకు తగిన సమయాన్ని కేటాయించాలని కోరారు. ఇటీవలే తన తల్లిని కోల్పోయానని. ఇక్కడికి వచ్చిన మాతృమూర్తుల్లో ఆమెను చూసుకుంటున్నట్లు తమిళిసై భావోద్వేగానికి గురయ్యారు.

మాతృమూర్తులకు కానుకలు అందిస్తున్న గవర్నర్ తమిళిసై

కొవిడ్‌ విపత్తు వేళ విలువైన సేవలందించిన రెడ్‌క్రాస్‌ ప్రతినిధులకు అభినందనలు. ట్విట్టర్‌, వాట్సాప్‌లో అభ్యర్థనలు వచ్చినప్పుడు... రెడ్‌క్రాస్‌ వారియర్స్‌ నా వెనుక ఉండటం వల్లే.. అర్ధరాత్రి సమయంలోనూ వారికి సాయం చేయగలిగాం. వేలాది మందికి సాయం చేయగలిగాం. లౌక్‌డౌన్‌ సమయంలో తలసేమియా బాధితులకు అండగా నిలిచాం. ఇందుకు సహకరించిన పోలీసులు, ఆర్మీ అధికారులకు కృతజ్ఞతలు. చాలా మంది చిన్నారులకు రక్తం అందింది. ఎదుటివారితో దయతో, మానవత్వంతో మెలగాలి.

- తమిళిసై, గవర్నర్

గైనకాలజిస్ట్‌గా ఉన్న జ్ఞానం పాలనలోనూ దోహదపడుతోందని ఆమె తెలిపారు. వైద్యానికి సంబంధించిన అంశాలపై ఎవరైనా నన్ను సంప్రదించవచ్చని వెల్లడించారు. మహిళలు, చిన్నారుల సంస్థను ప్రారంభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులతో మాట్లాడిన గవర్నర్ పిల్లల ఆరోగ్య వివరాలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు గవర్నర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. విపత్తుల సమయంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న రెడ్‌క్రాస్‌ ప్రతినిధుల్ని గవర్నర్‌ సత్కరించారు. రెడ్‌క్రాస్‌ అన్నిచోట్లా తమ కార్యకలాపాలు నిర్వహించాలని తమిళిసై ఆకాంక్షించారు. జిల్లాల్లోనూ బ్లడ్ బ్యాంక్, క్లినిక్ వంటివి ఏర్పాటు చేయాలని సూచించారు. ఎదుటివారితో దయతో, మానవత్వంతో మెలగాలని తమిళిసై కోరారు. రెడ్ క్రాస్ సభ్యులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన అంబులెన్స్​లను గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు.

తెలంగాణలో బాధ్యతలు నిర్వహించడం ఆనందంగా ఉంది: తమిళిసై

ఇవీ చూడండి:కాస్మోటిక్ బ్యూటీ కంటే... కాస్మో ఎనర్జీ ఎంతో ముఖ్యం: గవర్నర్

అసెంబ్లీపై ఖలిస్థాన్​ జెండాలు ప్రత్యక్షం.. పోలీసులు హైఅలర్ట్​

Last Updated :May 8, 2022, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details