తెలంగాణ

telangana

'ఏపీ అభ్యంతరాలను జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌ తిరస్కరించారు'

By

Published : Apr 27, 2022, 3:51 PM IST

గెజిట్ నోటిఫికేషన్ అమలు, బోర్డు నిర్వహణ, ప్రాజెక్టుల డీపీఆర్‌లపై హైదరాబాద్​లో జీఆర్​ఎంబీ సమావేశంలో చర్చ ముగిసింది. సీలేరు ప్రాజెక్టులో తెలంగాణ వాటాపై కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. కాగా సమావేశంలో ఏపీ పలు అభ్యంతరాలను వ్యక్తం చేయగా.. ఏపీ అభ్యంతరాలను జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌ తిరస్కరించారని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్​ కుమార్​ తెలిపారు.

grmb meeting
గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

GRMB Meeting: హైదరాబాద్ జలసౌధలో 13వ గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. బోర్డు ఛైర్మన్‌ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కు డైవర్ట్‌ చేస్తుందని... అందులో భాగంగా తెలంగాణకు 45 టీఎంసీ వాటా రావాలని రజత్‌కుమార్ పేర్కొన్నారు. అలాగే సీలేరు ప్రాజెక్టులో తెలంగాణ వాటాపై కూడా చర్చించినట్లు స్పష్టం చేశారు.

తెలంగాణకు చెందిన చనాకా- కొరాటా ఆనకట్ట, చౌటుపల్లి హన్మంతురెడ్డి, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లపై, ఆంధ్రప్రదేశ్​కు చెందిన వెంకటనగరం పంప్‌హౌస్‌, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల డీపీఆర్లపై కూడా చర్చించినట్లు రజత్‌కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పారు. సీడబ్ల్యూసీకి తాము నివేదక పంపించినట్లు వెల్లడించారు.

సమావేశంలో ఏపీ నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని రజత్​ కుమార్​ పేర్కొన్నారు. కాగా ఏపీ అభ్యంతరాలును జీఆర్​ఎంబీ ఛైర్మన్​ తిరస్కరించినట్లు చెప్పారు. గెజిట్​ నోటిఫికేషన్​పై సబ్​ కమిటీ ద్వారా వివరాలు అధ్యయనం చేసి నివేదిక ఇస్తారన్నారు. బోర్ఢు ఛైర్మన్​ ఎంపీ సింగ్​ అన్ని అంశాలను నోట్​ చేసుకున్నారని వివరించారు. ఈఎన్సీ మురళీధర్‌రావు, ఓఎస్డీ దేశ్​పాండే.. ఆంధ్రప్రదేశ్ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఈఎన్సీ నారాయణరెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

"మన ప్రాజెక్టులకు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయి. ఇవాళ కూడా ఏపీ నుంచి అభ్యంతరం పెట్టారు. ఏపీ అభ్యంతరాలను జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌ తిరస్కరించారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ను అధ్యయనం చేసి నివేదిక ఇస్తారు. గోదావరి నీటిని ఏపీ పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తోంది. గోదావరి జలాల్లో తెలంగాణకు 45 టీఎంసీల వాటా రావాలి. సీలేరు ప్రాజెక్టులో తెలంగాణ వాటాపై కూడా చర్చించాం." -రజత్‌కుమార్,​ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

ఏపీ అభ్యంతరాలను జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌ తిరస్కరించారు: రజత్‌కుమార్

ఇవీ చదవండి:KCR About National Politics : కేసీఆర్ నోట.... ''భారత రాష్ట్ర సమితి'

ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై రూ.3 వేల కోట్ల ఫైన్​ విధించాలి: కేఏ పాల్​

'ఆంధ్ర, తెలంగాణలో పెట్రోల్​పై పన్ను తగ్గించరా?'

ABOUT THE AUTHOR

...view details