తెలంగాణ

telangana

వివేకా హత్య కేసు.. సీబీఐ ఎదుటకు ఐదుగురు నిందితులు

By

Published : Feb 5, 2023, 10:34 AM IST

Updated : Feb 5, 2023, 11:12 AM IST

Viveka Murder Case: ఏపీకి చెందిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. విచారణలో భాగంగా ఐదుగురు నిందితులు హైదరాబాద్​లోని సీబీఐ కోర్టులో హాజరుకానున్నారు.

Viveka Murder Case
Viveka Murder Case

Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్​ వివేకా హత్య కేసు విచారణలో భాగంగా ఐదుగురు నిందితులు.. ఈ నెల 10న సీబీఐ కోర్టులో హాజరుకానున్నారు. ఈ కేసు దర్యాప్తు హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే. బదిలీ అయిన తర్వాత ఐదుగురు నిందితులనూ ఒకేసారి పిలవడం ఇదే తొలిసారి. ఏపీలోని కడప కేంద్ర కారాగారంలో ఉన్న ముగ్గురు నిందితులకు ప్రొడక్షన్ వారెంట్ జారీ కాగా, బెయిలుపై ఉన్న మరో ఇద్దరికి సీబీఐ నుంచి సమన్లు అందాయి. కడప జైలులో రిమాండు ఖైదీలుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్​ రెడ్డిలతోపాటు బెయిల్‌పై ఉన్న ఎర్రగంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరి 9న కడప నుంచి బయల్దేరి పదో తేదీ ఉదయం 10.30 గంటలకు సీబీఐ కోర్టు ముందు హాజరుకానున్నారు.

శనివారం ఉదయం కడపకు వచ్చిన ఎర్ర గంగిరెడ్డి సీబీఐ అధికారులను కలిసి సమన్లు తీసుకున్నారు. దస్తగిరికి ఇప్పటికే సమాచారమివ్వగా, ఆదివారం సమన్లు అందుకున్నారు. రిమాండు ఖైదీలుగా ఉన్న ముగ్గురికి ప్రొడక్షన్ వారెంట్ జారీ చేయడంతోపాటు వారిని సీబీఐ కోర్టులో హాజరుపరచాలని కడప జైలు అధికారులకు సమాచారమందింది. భద్రత మధ్య వీరిని హైదరాబాద్ తరలించాలని జైలు అధికారులు ఏఆర్​ పోలీసులను కోరారు. సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ తర్వాత.. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులను తిరిగి కడప జైలుకు తరలిస్తారా, లేక హైదరాబాద్‌లోనే ఏదైనా జైలుకు పంపుతారా అనేది తేలనుంది.

ఇవీ చదవండి :

Last Updated : Feb 5, 2023, 11:12 AM IST

ABOUT THE AUTHOR

...view details