తెలంగాణ

telangana

బైకు మీద ఒకరు.. ఫోర్ వీలర్​పై ఇద్దరే: డీజీపీ

By

Published : Mar 23, 2020, 2:34 PM IST

Updated : Mar 23, 2020, 2:45 PM IST

ఈరోజు నుంచి ద్విచక్రవాహనంపై ఒకరు, ఫోర్ వీలర్​పై ఇద్దరికి మాత్రమే అనుమతి ఉన్నట్లు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

dgp mahender reddy speech about traffic rules and regulations
బైకు మీదు ఒకరు.. ఫోర్ వీలర్​పై ఇద్దరే: డీజీపీ

ఈరోజు నుంచే ద్విచక్రవాహనంపై ఒకరికి, ఫోర్ వీలర్‌పై ఇద్దరికి మాత్రమే అనుమతి ఉన్నట్లు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆటో సంఘాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

లాక్​ డౌన్ అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు.

బైకు మీద ఒకరు.. ఫోర్ వీలర్​పై ఇద్దరే: డీజీపీ

ఇవీ చూడండి:కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం: ఈటల

Last Updated :Mar 23, 2020, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details