తెలంగాణ

telangana

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం : డీజీపీ

By

Published : Jan 25, 2021, 1:48 PM IST

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో సీసీ కెమెరాలను డీజీపీ మహేందర్‌ రెడ్డి ప్రారంభించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమని పేర్కొన్నారు.

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం: డీజీపీ
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం: డీజీపీ

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. మాదాపూర్ జోన్‌లో 2 వేల 58 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

కెమెరాతో అనుసంధానమైన 3 వాహనాలు ప్రారంభించిన డీజీపీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో లక్షా 26 వేల కెమెరాలు ఉన్నాయని తెలిపారు. కమ్యూనిటీ సీసీ కెమెరాలు 18 వేల 487, నేను సైతం సీసీ కెమెరాలు 1 లక్ష 8 వేలు ఏర్పాటు చేశారని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details