Deepa Dasmunsi as Telangana Congress New Incharge : దేశంలో రాబోయే పార్లమెంటు ఎన్నికలను కీలకంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. బీజేపీని గట్టిగా ఎదుర్కొని అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు వ్యూహాలను రచించింది. కాంగ్రెస్ తాజాగా వివిధ రాష్ట్రాల ఇంఛార్జీలను బదిలీ చేయడంతోపాటు మార్పులు, చేర్పులు చేసింది.
ఈ నెల 21వ తేదీన దిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించింది. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలాలు, బలహీనతలపై కూడా చర్చించిన సీడబ్ల్యూసీ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలిచేందుకు ఏ విధంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందో వ్యూహరచన చేస్తోంది.
Telangana Congress New Incharge :అందులో భాగంగా కాంగ్రెస్ అధిష్ఠానం పలు రాష్ట్రాల ఇంఛార్జిలను బదిలీ చేయడంతోపాటు మార్పులు చేర్పులు చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఈ మేరకు మార్పలు, చేర్పులు చేసి నియామకాలు చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలు కీలకం కావడంతో ఆయా రాష్ట్రాల్లో గెలుపు గుర్రాలను ఎన్నికల బరిలో నిలిపి గెలిచేందుకు పార్టీని నిర్మాణం చేయాల్సి ఉంటుందని, అదేవిధంగా బలహీనంగా ఉన్న ప్రాంతాలల్లో పార్టీని బలోపేతం చేయాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
లోక్సభ ఎన్నికల్లో ప్రజా తీర్పు కాంగ్రెస్కే అనుకూలం : కొండా సురేఖ
Telangana Congress Focus on Lok Sabha Elections :ప్రధానంగా పార్టీ ప్రధాన కార్యదర్శులను, సీనియర్ నేతలను వివిధ రాష్ట్రాలకు ఇంఛార్జిలుగా నియమించడంతో పాటు పార్టీ ఆర్గనైజింగ్ బాధ్యులను కూడా కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ప్రధాన కార్యదర్శులు ముఖుల్ వాస్కీని గుజరాత్కు, జితేంద్ర సింగ్ను అసోంతోపాటు మధ్యప్రదేశ్కు అదనపు బాధ్యతలు అప్పగించారు.