తెలంగాణ

telangana

వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్

By

Published : Jul 22, 2020, 7:52 AM IST

Updated : Jul 22, 2020, 9:06 AM IST

వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 10 నుంచి 15 రోజుల వరకు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్తున్నట్టు ట్వీట్ చేశారు.

corona-positive-to-mp vijayasai-reddy
వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు, వైకాపా పార్టీ నేత విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవల ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా... వైరస్​ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

మంగళవారం సాయంత్రం తనకు కరోనా సోకినట్లు ఆయన ట్వీట్ చేశారు. చికిత్స కోసం హైదరాబాద్​లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. 10 రోజుల పాటు తాను సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్తున్నట్టు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండీ...విద్యార్థుల్లో 'లెర్న్​ టు ఎర్న్'​కు నాంది పడాలి: సీఎం జగన్

Last Updated :Jul 22, 2020, 9:06 AM IST

ABOUT THE AUTHOR

...view details