తెలంగాణ

telangana

ఈనెల 23 నుంచి హైదరాబాద్​లో బుక్​ఫెయిర్

By

Published : Dec 13, 2019, 4:08 PM IST

ఏటా నిర్వహించే హైదరాబాద్​ బుక్​ఫెయిర్ ఈనెల 23 నుంచి జనవరి 1 వరకు సాగనుంది. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే పుస్తక ప్రదర్శనలో ఈసారి 330 స్టాళ్లు కొలువుదీరనున్నాయి.

Book Fair in Hyderabad
హైదరాబాద్​లో బుక్​ఫెయిర్

ఏటా పుస్తక ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈనెల 23 నుంచి ప్రారంభం కానుంది. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈనెల 23 నుంచి జనవరి 1 వరకు పుస్తక ప్రదర్శన ఉండనుందని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీ శంకర్ ప్రకటించారు.

బుక్ ఫెయిర్​లో దిల్లీ, కోల్​కతా, రాజస్థాన్ తర్వాత తెలంగాణ నాలుగవ స్థానానికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రదర్శనలో 330 స్టాళ్లు ఉంటాయని.. దేశవిదేశాలకు చెందిన పుస్తక పబ్లిషర్స్ కూడా పాల్గొంటున్నారని తెలిపారు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్​, తమిళం, సంస్కృతం, ఉర్దూ, మరాఠీ, కన్నడ భాషా పుస్తకాలు లభ్యమవుతాయని అన్ని వర్గాల వారు సందర్శించి బుక్ ఫెయిర్​ను విజయవంతం చేయాలని గౌరీశంకర్ కోరారు.

హైదరాబాద్​లో బుక్​ఫెయిర్

ఇదీ చూడండి: నిర్భయ: న్యాయం కోసం ఈ నెల 18 వరకు ఆగాల్సిందేనా?

sample description

ABOUT THE AUTHOR

...view details