తెలంగాణ

telangana

రాజగోపాల్‌రెడ్డి అమిత్‌షాను కలవడం యాదృచ్ఛికం : భట్టి

By

Published : Jul 28, 2022, 8:56 AM IST

Bhatti on MLA Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. అమిత్‌ షాను కలవడం యాదృచ్ఛికం కావొచ్చని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ఆయన కాంగ్రెస్‌లోనే ఉంటారని.. ఏ విషయంలోనైనా మనస్తాపం చెందితే చర్చించి పార్టీలో ఉండేలా చూస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

రాజగోపాల్‌రెడ్డి అమిత్‌షాను కలవడం యాదృచ్ఛికం కావొచ్చు: భట్టి
రాజగోపాల్‌రెడ్డి అమిత్‌షాను కలవడం యాదృచ్ఛికం కావొచ్చు: భట్టి

Bhatti on MLA Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన మనస్తాపం చెందితే.. చర్చించి పార్టీలో ఉండేలా చూస్తామన్నారు. రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల భాజపాలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతున్న వేళ.. రాష్ట్ర నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ బుధవారం సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్‌ రెడ్డితో రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు.

సమావేశం అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలపైనే చర్చించామని.. త్వరలో కాంగ్రెస్‌లో భారీ చేరికలు ఉంటాయని భట్టి తెలిపారు. రాజగోపాల్‌రెడ్డి.. అమిత్‌ షాను కలవడం యాదృచ్ఛికం కావొచ్చని అభిప్రాయపడ్డారు. బండి సంజయ్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదని భట్టి విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details