తెలంగాణ

telangana

Balkampet Yellamma Kalyanam 2023 : అంగరంగ వైభవంగా రేపు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

By

Published : Jun 19, 2023, 1:54 PM IST

Balkampet Yellamma Kalyanam in Hyderabad : ప్రఖ్యాత బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి కల్యాణ వేడుకలకు రంగం సిద్ధమైంది. ఏటా ఆషాడమాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కల్యాణానికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

balkampet yellamma
balkampet yellamma

Balkampet Yellamma Kalyanam in Tomorrow :బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవె అంగరంగ వైభవంగా జరుగనుంది. సోమవారం రోజున ఎదుర్కోలు ఉత్సవం.. 20వ తేదీన అమ్మవారి కల్యాణం, 21న రథోత్సవం కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు అందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రధానంగా అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా.. అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ తెలిపారు.

కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తాం : ప్రతి సంవత్సరం లాగే వివిధ శాఖల ఆధ్వర్యంలో.. పకడ్బందీగా ఏర్పాట్లును పర్యవేక్షిస్తూ.. కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గత సంవత్సరం ఉత్సవాలకి 8 లక్షల మంది భక్తులు వచ్చారని.. ఈ ఏడాది దాదాపుగా 15లక్షల వరకు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గతంలో అతికొద్ది మంది సమక్షంలో జరిగే ఈ వేడుక.. ప్రస్తుతం కొన్ని లక్షల మంది మధ్య జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలందరూ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించే విధంగా ఆలయం సమీపంలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను సిద్ధం చేశామని తలసాని శ్రీనివాస్​ యాదవ్ వివరించారు.

"బల్కంపేట ఎల్లమ్మ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపట్టాం. ఈ మేరకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశాం. గత ఏడాది ఉత్సవాలకి 8 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. ఈ సంవత్సరం 15 లక్షల మంది వస్తారని అంచనా. గతంలో అతికొద్ది మంది సమక్షంలో జరిగే ఈ వేడుక.. ప్రస్తుతం కొన్ని లక్షల మంది మధ్య జరుగుతుంది. ప్రజలందరూ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించే విధంగా ఆలయం సమీపంలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను సిద్ధం చేశాం. ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం."- తలసాని శ్రీనివాస్ ​యాదవ్, మంత్రి

Balkampet Yellamma Kalyanam 2023 : మరోవైపు మొక్కుల రూపంలో భక్తుల సమర్పించిన వెండితో ఆలయ ప్రధాన ద్వారం తలుపులకు వెండి తాపడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అమ్మవారి కల్యాణానికి వచ్చే లక్షలాది మంది భక్తులు.. దర్శనం చేసుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. రథోత్సవం రోజున 500 మంది కళాకారులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు, ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా మరిన్ని సిద్ధం చేశారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో పని చేసే విధంగా ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌తో ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఉత్సవాలు జరిగే రెండు రోజులు ఆలయం వైపు వాహనాలు రాకుండా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details