తెలంగాణ

telangana

TS Inter exams: కొవిడ్ జాగ్రత్తలతో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాం: బోర్డు కార్యదర్శి

By

Published : Oct 23, 2021, 4:46 PM IST

కొవిడ్ జాగ్రత్తలతో ఇంటర్(TS Inter exams) పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,768 పరీక్ష కేంద్రాల్లో జరిగే పరీక్షలకు (TS Inter exams) 4.59 లక్షల మంది హాజరుకానున్నట్లు చెప్పారు. 82 శాతం మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని వివరించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. విద్యార్థులు నీళ్ల సీసాలు తెచ్చుకోవచ్చని ఉమర్ జలీల్ స్పష్టం చేశారు.

ts inter exams
ఇంటర్​ పరీక్షలు

రాష్ట్రంలో ఈనెల 25 నుంచి నవంబరు 3 వరకు జరగబోయే ఇంటర్మీడియట్(TS Inter exams) పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్​ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ప్రకటించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బోర్డు(TS Inter exams) కార్యాలయంలో ఇంటర్​ పరీక్షల(TS Inter exams) ఏర్పాట్లపై మీడియా సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. గతేడాది కరోనా కారణంగా పరీక్షల నిర్వహణ జరగలేదని.. ఈ సారి కోర్టు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొవిడ్​ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని జలీల్ తెలిపారు. మొత్తం 4 లక్షల 59 వేల విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహమ్మారి దృష్ట్యా ఈసారి పరీక్ష కేంద్రాలు పెంచామని పేర్కొన్నారు. మొత్తం 1,768 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియట్(TS Inter exams) పరీక్షలు జరుగుతాయని బోర్డు కార్యదర్శి తెలిపారు. ఇప్పటివరకు 82 శాతం మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని వివరించారు.

ఆదివారమూ పరీక్ష

ఈసారి 70 శాతం సిలబస్​తో పరీక్ష నిర్వహిస్తున్నందున.. ఆ సిలబస్​కు పరిమితమయ్యే పరీక్ష ఉంటుందని ఉమర్​ జలీల్​ చెప్పారు. మూడు సెట్ల పరీక్ష పత్రాలను ఎంపిక చేశామని అన్నారు. ఈనెల 31 ఆదివారమైనా పరీక్ష ఉంటుందని తెలిపారు. ఈ విషయాలు విద్యార్థులు గమనించాలని కోరారు. విద్యార్థులు పరీక్షల సన్నద్ధత కోసం బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ అందుబాటులో ఉందని.. ఇంటర్మీడియట్(TS Inter exams) యూట్యూబ్ ఛానల్, వెబ్​సైట్ నుంచి డౌన్​లోడ్ చేసుకొని చదువుకోవచ్చని తెలిపారు.

ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక కారణంగా.. ఆ రోజు నిర్వహించాల్సిన పరీక్ష మరుసటి రోజు నిర్వహిస్తున్నాం. 31 ఆదివారం కావడంతో ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఈ సారి విద్యార్థులకు మంచి నీళ్ల తీసా తెచ్చుకునే అవకాశం కల్పిస్తున్నాం. పారదర్శంగా పరీక్షలు జరిగే ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలి.-ఉమర్​ జలీల్​, ఇంటర్​ బోర్డు కార్యదర్శి

విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష పేపర్లల్లోనూ ఎక్కువ ఆప్షన్లు పొందుపరిచామని.. విద్యార్థులు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా తప్పకుండా హాజరై ధైర్యంగా పరీక్షలు(TS Inter exams) రాయాలని ఆయన కోరారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఉమర్ జలీల్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:Kishan reddy Campaign: 'బానిసలు కావాలా... మీ గొంతుక వినిపించే వ్యక్తి కావాలా?'

ABOUT THE AUTHOR

...view details