తెలంగాణ

telangana

మత్స్యావతారంలో కనువిందు చేస్తున్న భద్రాద్రి రాముడు

By

Published : Dec 27, 2019, 1:37 PM IST

భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో మొదటి రోజైన నేడు రామయ్య తండ్రి మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

Vaikuntha Ekadashi celebrations at badradri lord rama temple in badradri kothagudem district
భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీసీతారామస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజే ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో రామయ్య తండ్రి మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఆలయ ఈవో నరసింహులు బేడా మండపంలో వేదపండితులకు, అర్చకులకు దీక్ష వస్త్రాలు అందించారు. అనంతరం వేద పండితులు, ఆళ్వారులు స్వామివారి ఎదుట తిరుప్పావై, 200 పాశురాలను పారాయణం చేశారు.

మధ్యాహ్నం పూట కోలాట నృత్యాలు,సకల రాజలాంఛనాల నడుమ.. మత్స్యావతారంలో ఉన్న రామయ్య తండ్రిని తిరువీధుల్లో ఊరేగించనున్నారు.

Intro:మత్స్య


Body:అవతారం


Conclusion:భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో మొదటి రోజైన నేడు రామయ్య తండ్రి మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఆలయ ఈవో నరసింహులు బేడా మండపంలో ఆలయ వేదపండితులకు అర్చకులకు దీక్ష వస్త్రాలు అందించారు అనంతరం వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి ఈ ఓ కు ఆశీర్వచనం అందించారు అనంతరం వేద పండితులు ఆళ్వారులు స్వామివారి ఎదుట తిరుప్పావై 200 పాశురాలను పారాయణం చేశారు మధ్యాహ్నం కోలాట నృత్యాలు సకల రాజలాంఛనాల నడుమ మత్స్య అవతారం లో ఉన్న రామయ్య తండ్రి తిరువీధులలో విహరిస్తారు

ABOUT THE AUTHOR

...view details