తెలంగాణ

telangana

వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం... ప్రయాణికులను ఆపి వ్యాక్సినేషన్

By

Published : Nov 15, 2021, 1:59 PM IST

కొన్ని దేశాలను థర్డ్ వేవ్ ఇప్పటికే భయపెడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌(Corona vaccination in Telangana) ప్రక్రియ వేగం పెంచాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు(Telangana Health Minister Harish Rao) అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో భద్రాచలంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు.

vaccination-is-level-up-in-bhadrachalam
వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ (Corona vaccination in Telangana) ప్రక్రియ వేగం పెంచాలని అధికారులను రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Telangana health minister Harish Rao) ఆదేశించారు. ఈ నేపథ్యంలో 100 శాతం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ లక్ష్యంగా అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కాస్తా తగ్గుముఖం పట్టడంతో టీకాలు వేయించుకునేందుకు ప్రజలు ముందుకురావడం లేదు. దీంతో భద్రాచలంలో వైద్యసిబ్బంది రోడ్లపై వెళ్తున్నవారిని ఆపి మరీ టీకాలు వేశారు. మొదటి రెండవ డోసులు వేసుకున్నారా? లేదా ? అని అడిగి మరి వ్యాక్సినేషన్ (Corona vaccination in Telangana) చేశారు.

భద్రాచలంలో వ్యాక్సినేషన్ (Corona vaccination in Telangana) వేగవంతంగా పూర్తి చేయడానికి పన్నెండు బృందాలుగా విడిపోయి ఆయా సెంటర్లలో టీకాలు వేస్తున్నారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలోని స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కూడా వ్యాక్సినేషన్ (Corona vaccination in Telangana) వేసుకొని వారికి వ్యాక్సిన్లు వేస్తున్నారు. భద్రాచలంలోని ప్రధాన సెంటర్ లైన్​ బ్రిడ్జి సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, రామాలయం, అంబేడ్కర్ సెంటర్, మార్కెట్ ఏరియా ఐదు సెంటర్లలో ప్రతి ఒక్కరిని పిలిచి మరి వ్యాక్సిన్ వేసుకున్నారా? లేదా? అని అడిగి మొదటి, రెండు డోసులకు రిజిస్ట్రేషన్ చేసి వెంటనే వ్యాక్సినేషన్ (Corona vaccination in Telangana) చేస్తున్నారు. మిగలిన 7 బృందాలు పట్టణంలోని అన్ని కాలనీలలో ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.

నూరు శాతం టీకాల పంపిణీ

తెలంగాణలో నూరు శాతం కరోనా టీకాల పంపిణీ(Corona Vaccination in Telangana)కి రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రణాళికలు రచిస్తోంది. జీహెచ్​ఎంసీ పరిధిలో ఇప్పటికే తొలిడోసు టీకా ప్రక్రియ 100 శాతం పూర్తయింది. పల్లెల్లోనూ అర్హులైన వారందిరికి 100 శాతం టీకాల పంపిణీ(Corona Vaccination in Telangana) అమలు చేసే విధంగా.. స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టింది.

కొంత ఆలస్యమైనా, కచ్చితంగా టీకా రెండో డోసు(Corona second dose) తీసుకుంటేనే కొవిడ్‌ నుంచి రక్షణ లభిస్తుందని వైద్యశాఖ స్పష్టం చేస్తోంది. రెండో డోసు పొందని వారు రాష్ట్రంలో సుమారు 36.55 లక్షల మంది ఉండడంతో వీరిపై దృష్టి పెట్టింది. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశించడంతో.. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రజలకు రెండో డోసు ప్రాధాన్యాన్ని వివరించేందుకు గ్రామస్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.

ఇదీ చూడండి:Minister Harish Rao: 'రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ వేగం పెంచండి'

ABOUT THE AUTHOR

...view details