తెలంగాణ

telangana

Godavari Flood Effect : వరదతో వచ్చి బురదలో చిక్కుకున్న మొసలి

By

Published : Jul 20, 2022, 9:39 AM IST

Godavari Flood Effect

Godavari Flood Effect : మహోగ్రరూపం చూపిన గోదావరి శాంతించడంతో భద్రాద్రి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ వరదతో పాటు పాములు, తేళ్లు, మొసళ్లు ఇళ్లు, పొలాల్లోకి చేరాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామం పంట పొలంలో మొసలి పిల్ల సంచారం కలకలం రేపింది. పొలంలో బురదలో చిక్కుకున్న మొసలి పిల్లను జంతు సంరక్షణ అధికారులు బయటకు తీశారు. అనంతరం హైదరాబాద్ జూపార్కుకు తరలించారు.

Godavari Flood Effect : గోదావరి వరదలు కాస్త శాంతించాయి. ఇప్పుడిప్పుడే ఇళ్ల బాట పడుతున్న ముంపు గ్రామాల బాధితులు ఇళ్లను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో వరదతోపాటు పాములు, తేళ్లు, మొసళ్లు రావడం గమనించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాకలో పొలం పనులకు వెళ్లిన రైతులు బురదలో మొసలి పిల్ల చిక్కుకోవడం గమనించారు.

పొలంలో బురదలో ఇరుక్కుని ఎటు వెళ్లాలో తెలియక తికమకపడుతున్న మొసలి గురించి రైతులు అధికారులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న జంతు సంరక్షణ అధికారులు పంట పొలంలో ఉన్న మొసలిపిల్లను పట్టుకున్నారు. అనంతరం హైదరాబాద్‌లో నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు తరలించారు.

వరద ప్రవాహంలో ఇలా పాములు, మొసళ్లు కొట్టుకువచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వీటిని గుర్తిస్తే చంపకుండా.. తమకు సమాచారం అందించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details