తెలంగాణ

telangana

"తెలంగాణ తరహాలోనే మరో మహోద్యమానికిి సిద్ధం కావాలి"

By

Published : Dec 3, 2022, 6:10 PM IST

బండిసంజయ్
బండిసంజయ్​ ()

Bandi sanjay praja sangrama yatra: తెలంగాణ తరహాలోనే మరో మహోద్యమానికి సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పిలుపునిచ్చారు. నిర్మల్​జిల్లా లోని దిలార్​వార్​పూర్​ ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని రైతులను, స్థానికులను కలుపుకుంటూ.. 6వ రోజు పాదయాత్ర కొనసాగించారు.

Bandi sanjay praja sangrama yatra: నిర్మల్ జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఇవాళ దిలార్​వార్​పూర్ ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసిన అనంతరం స్థానికంగా ఉన్న పాఠశాలలో దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాకముందు ఏ పరిస్థితులున్నాయో.. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా అవే పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

"తెలంగాణ తరహాలోనే మరో మహోద్యమానికిి సిద్ధం కావాలి"

తెలంగాణ వచ్చినా కూడా డబుల్​ బెడ్​రూం ఇళ్లు రాలేదు, ఉద్యోగాలు రాలేదు, నిరుద్యోగ భృతి అందలేదు, రుణమాఫీ కాలేదు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు, స్వర్ణకారులు, చేనేత కార్మికులు సహా చేతి వృత్తులు చేసే వారి ఆకలి చావులు కొనసాగుతూనే.. ఉన్నాయని ఆరోపించారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రూ.5 లక్షల కోట్లు అప్పు చేసి ఏమి సాధించిందో చెప్పాలని.. డిమాండ్​ చేశారు.

"తెలంగాణ తరహాలోనే మరో మహోద్యమానికిి సిద్ధం కావాలి"

కేసీఆర్​ బిడ్డకు లిక్కర్​ స్కామ్​లో నోటీసులిస్తే.. తెలంగాణ ప్రజలు ఎందుకు ధర్నా చేయాలని ప్రశ్నించారు. 1400 మంది బలిదానంతో ఏర్పడ్డ తెలంగాణలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్లు దాచుకున్న కేసీఆర్​ కుటుంబాన్ని తరిమి కొట్టడానికి తెలంగాణ తరహాలో మరో మహోద్యమానికి సిద్ధం కావాలని బండి సంజయ్​ పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details