టోక్యో పారాలింపిక్స్లో భారత్కు మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. ప్రపంచ నెంబర్వన్ ప్రమోద్ భగత్, యతిరాజ్ సుహాస్.. శనివారం జరిగిన బ్యాడ్మింటన్ సింగిల్స్లో ఫైనల్స్కు దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3, ఎస్ఎల్4 విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు.
సెమీస్లో జపాన్కు చెందిన పుజిహారాపై 21-11,21-16తేడాతో ప్రమోద్ విజయం సాధించగా.. ఫ్రెడీ సెతియావాన్పై 21-9,21-15తేడాతో యతిరాజ్ గెలుపొందాడు. ఈ విజయంతో వీరిద్దరూ కనీసం రజతాన్ని ఖాయం చేసుకున్నారు. ఇక పైనల్లో(స్వర్ణ పోరు) గెలిస్తే గోల్డ్ మెడల్ సొంతమవుతుంది.
ప్రమోద్ స్వర్ణ పోరు ఈరోజు(సెప్టెంబరు 4) మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమవనుండగా.. యతిరాజ్ సెప్టెంబరు 5న ఆడనున్నాడు.