తెలంగాణ

telangana

అఫ్గాన్​పై న్యూజిలాండ్ విజయం.. ఇండియా ఇంటికి

By

Published : Nov 7, 2021, 6:32 PM IST

Updated : Nov 7, 2021, 6:49 PM IST

అఫ్గానిస్థాన్​పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా టీ20 ప్రపంచకప్​ సెమీస్​లో బెర్త్ ఖరారు చేసుకుంది. ఫలితంగా భారత్.. సెమీస్​ రేసు నుంచి నిష్క్రమించింది.

new zealand beat afghanistan
న్యూజిలాండ్

భారత్ అభిమానులు ఎంతో ఆసక్తితో చూసిన మ్యాచ్​ ఇది. మనం సెమీస్​ చేరాలంటే అఫ్గాన్ జట్టు గెలవాలని కోరుకున్న టీమ్​ఇండియా ఫ్యాన్స్​కు నిరాశే మిగిలింది. ఆదివారం జరిగిన మ్యాచ్​లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి, సెమీస్​లో అడుగుపెట్టింది.

అబుదాబీలో జరిగిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 124/8 స్కోరు చేసింది. నజీబుల్లా(73) మినహా అందరూ విఫలమయ్యారు.

అనంతరం ఛేదనలో కివీస్ పూర్తి అధిపత్యం చూపించింది. 18 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. కెప్టెన్ విలియమ్సన్ 40, కాన్వే 36, గప్తిల్ 28 పరుగులతో ఈగెలుపులో కీలకపాత్ర పోషించారు.

న్యూజిలాండ్ జట్టు
Last Updated : Nov 7, 2021, 6:49 PM IST

ABOUT THE AUTHOR

...view details