తెలంగాణ

telangana

T20 World Cup: 'టీమ్​ఇండియాను తక్కువ అంచనా వేయొద్దు'

By

Published : Oct 31, 2021, 6:46 PM IST

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup) భాగంగా.. ఒక్క మ్యాచ్​ ఓటమితోనే భారత జట్టు భవితవ్యాన్ని నిర్దేశించొద్దని టీమ్​ఇండియా మాజీ ఆటగాడు దినేశ్ కార్తీక్(Dinesh Karthik News) సూచించాడు. ఒక్కసారి జోరందుకుంటే భారత్​ జట్టును అడ్డుకోవడం ఇతర జట్లకు అసాధ్యమని అభిప్రాయపడ్డాడు.

dinesh karthik
దినేశ్ కార్తీక్

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) భాగంగా ఇప్పటివరకు టీమ్​ఇండియా ఒకే మ్యాచ్​ ఆడింది. తొలి మ్యాచ్​లోనే పాకిస్థాన్​పై(IND vs PAK T20) 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో భారత జట్టును తక్కువ అంచనా వేయడం సరికాదని అన్నాడు మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. ఒక్కసారి ఊపందుకుంటే.. కోహ్లీసేనను ఏ జట్టు ఎదుర్కోలేదని అని ట్వీట్ చేశాడు.

"టీ20 ప్రపంచకప్​లో టీమ్​ఇండియా ముందుకెళ్లడం కష్టమని చాలా మంది భావిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక్క ఓటమితోనే ఈ నిర్ణయానికి రావడం సరికాదు. రాబోయే మ్యాచ్​ భారత జట్టు భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. ఒక్కసారి భారత్​ ఊపందుకుంటే ఇక వారిని ఆపడం ఎవరివల్లా కాదు."

--దినేశ్ కార్తీక్, టీమ్​ఇండియా మాజీ ఆటగాడు.

మరికొన్ని గంటల్లో టీమ్​ఇండియా.. న్యూజిలాండ్​తో(IND vs NZ T20 Match) తలపడనుంది. ఈ మ్యాచ్​ గెలవడం ఇరు జట్లకూ చాలా ముఖ్యం. ఈ పోరులో నెగ్గిన వారికే సెమీస్​కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దినేశ్ కార్తీక్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఆ నాలుగు జట్లే..

ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లేదా భారత్, పాకిస్థాన్ జట్లు టీ20 ప్రపంచకప్​ ఫైనల్​లో తలపడే అవకాశాలున్నాయని ఇటీవలే అంచనా వేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, టీమ్​ఇండియా, పాకిస్థాన్​ జట్లు సెమీస్​ చేరుకుంటాయని అభిప్రాయపడ్డాడు.

ఇదీ చదవండి:

T20 World Cup: వరుణ్ స్థానంలో అశ్విన్.. నాలుగో ఆటగాడిగా జడ్డూ!

ABOUT THE AUTHOR

...view details