ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్కు.. మరో నలుగురు భారత అథ్లెట్లు అర్హత సాధించారు. దోహా వేదికగా జరుగుతున్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నీలో ఆడుతున్న టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లు.. శరత్ కమల్, జ్ఞానశేఖరన్ సాథియన్, సుతీర్థ ముఖర్జీ, మనికా బాత్ర ఒలింపిక్స్కు క్వాలిఫై అయ్యారు.
గ్రూప్లో అత్యధిక విజయాలతో సాథియన్, ముఖర్జీ ఈ మెగా ఈవెంట్లో స్థానాలను పొందగా.. కమల్, బాత్ర మాత్రం తమ అత్యుత్తమ ర్యాంకుల ఆధారంగా ఒలింపిక్ బెర్తులను దక్కించుకున్నారు.
శరత్ నాలుగో సారి..
తాజాగా టోక్యో ఒలింపిక్స్కు క్వాలిఫై అయిన శరత్ కమల్కు ఈ మెగా టోర్నీలో పాల్గొనడం నాలుగో సారి. గతంలో 2004, 2008, 2016లో ప్రతిష్టాత్మక ఆటలకు శరత్ అర్హత పొందాడు.