WTC Final 2023 Teamindia vs Australia : టెస్టు క్రికెట్లో అత్యంత ప్రతిష్ఠాత్మక టోర్నీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్(#WTC Final 2023). టెస్టు క్రికెట్కు తిరిగి పూర్వ వైభవం తెచ్చేందుకు ఐసీసీ ప్రయోగాత్మకంగా 2019లో ఈ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ను ప్రారంభించింది. పాయింట్స్ టేబుల్లో టాప్-2 ఉన్న టీమ్స్తో రెండేళ్లకోసారి ఫైనల్ నిర్వహిస్తోంది. అయితే ఫస్ట్ ఎడిషన్లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరగగా.. న్యూజిలాండ్ విజయం సాధించింది. గదను దక్కించుకుంది. అయిదే ఈ సారి తొమ్మిది టీమ్స్ పోటీపడగా.. మరోసారి టీమ్ఇండియా ఫైనల్ చేరుకుంది. అలానే భారత్తో తలపడేందుకు ఆస్ట్రేలియా ఈ తుదిపోరుకు అర్హత సాధించింది. మరి ఇంకో రోజులో ప్రారంభంకానున్న ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ ఎక్కడ జరగనుంది, ఆ టీమ్స్ వివరాలు, విన్నర్ ప్రైజ్మనీ ఎంత? వంటి వివరాలను తెలుసుకుందాం.
మ్యాచ్ ఎక్కడ జరగనుంది.. జూన్ 07-11 మధ్య ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ జరగనుంది. జూన్ 12ను రిజర్వ్ డేగా అనౌన్స్ చేశారు. వర్షం లేదా ఇతర కారణాల వల్ల ఈ ఐదు రోజుల్లో ఎప్పుడైన ఆట నిర్వహణ కుదరకపోతే.. రిజర్వ్ డే మ్యాచ్ను కొనసాగిస్తారు. లండన్ ఓవల్ స్టేడియం(wtc final 2023 venue) వేదికగా ఈ ఫైనల్ నిర్వహించనున్నారు.
ఎక్కడ చూడాలి.. భారత్ క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్షప్రసారం ద్వారా చూడొచ్చు. డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్లోనూ లైవ్స్ట్రీమింగ్ అవుతుంది(wtc final 2023 ott platform). ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
WTC Final Prizemoney : ఈ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుకు గదను అందిస్తారు. దీంతో పాటు ఆ జట్టుకు రూ.13 కోట్లు (1.6 మిలియన్ డాలర్లు) ప్రైజ్మనీ అందజేస్తారు. రన్నరప్గా నిలిచిన జట్టుకు రూ.6.5 కోట్లు (8 లక్షల డాలర్లు) నగదు బహుమతి ఇస్తారు.
జట్ల వివరాలు..