టీమ్ఇండియా దిగ్గజం సచిన్ తెందూల్కర్(sachin news latest) మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు సాయం చేసేందుకు ముందడుగు వేశారు. అసోం కరీమ్గంజ్ జిల్లా మకుంద క్రిస్టియన్ కుష్ఠు, జనరల్ ఆస్పత్రిలోని పెడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్కు రెటినాల్ కెమెరాలను సాయంగా అందించారు.
తన సేవా సంస్థ తరపున ఈ సహాయం చేశారు సచిన్. పసిపిల్లలు, చిన్నారుల్లో అంధత్వం రాకుండా నివారించే థెరపీకి పరీక్షల నిమిత్తం రెటినాల్ కెమెరాలు ఉపయోగపడుతాయి. వీటితో చాలా మందికి లాభం కలుగుతుందని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.